Did Italians Throw Their Money On The Streets? Here's The Truth
ఇటలీ ప్రజలు రోడ్లపైకి డబ్బులు విసిరేస్తున్నారా? ఈ ఫొటోల వెనుక నిజం ఇదే!
ఈ మెసేజ్ మీకు వచ్చే ఉంటుంది. ఇటలీ ప్రజలు డబ్బులు వీధుల్లో పాడేస్తున్నారని, జీవితం మీద ఆశలు వదులుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నిజం తెలిస్తే మీరు తప్పకుండా షాకవుతారు.
Samayam Telugu1 Apr 2020, 10:20 am
ఇటలీలో కరోనా వైరస్ మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. చైనాలో పుట్టి ఇతర దేశాలకు విస్తరించిన ఈ వైరస్ వల్ల అత్యధిక మరణాలు ఇటలీలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పటికీ ఇటలీ కరోనా నుంచి కోలుకోలేని దుస్థితిలోనే ఉంది. అక్కడి ప్రజల అలవాట్లు, మూర్ఖత్వం వల్ల వైరస్ చాలా వేగంగా విస్తరించింది. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి, ప్రజలను ఇళ్లకు పరిమితం చేసింది. కానీ, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. అయితే, ఇటలీ తమ విశ్వాసాన్ని వదులుకోలేదు. తమ ప్రజలను కాపాడుకొనేందుకు తన ప్రయత్నం చేస్తూనే ఉంది. మంగళవారం వరకు ఇటలీలో సుమారు లక్ష మందికి కరోనా వైరస్ సోకింది. 11వేల మంది చనిపోయారు.
జీవితం మీద ఆశలు వదిలేసుకున్నారా?
కరోనా వల్ల ప్రపంచంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న దేశం ఇటలీనే. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరు ఈ వైరస్కు బలవుతారనే భయం వారిని వెంటాడుతోంది. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ఓ వార్త దావనంలా వ్యాపిస్తోంది. ఇటలీ ప్రజలు జీవితంపై ఆశలు వదిలేసుకున్నారని, డబ్బును వీధుల్లోకి వీధుల్లోకి విసేరేస్తున్నారని అందులో ఉంది.
అందుకే డబ్బులు పాడేశారా?
వాట్సాప్, ఫేస్బుక్, హెలోలో ఈ ఫొటోలు వైరల్గా మారాయి. ‘‘ఇటలీలోని ధనవంతులు తమ దగ్గర ఉన్న డబ్బుని రోడ్ల మీద పడేశారు.
కష్ట కాలంలో.. చెడు కాలంలో ఉన్న మమ్మల్ని ఈ డబ్బు సంతోషపరచలేకపోయింది. ఈ డబ్బు మా పిల్లల్ని, మా కుటుంబ సభ్యుల్ని కాపాడుకోలేకపోయిందని రోడ్ల మీద డబ్బుని చల్లారు’’ అంటూ ప్రచారం మొదలైంది. ప్రజలు కూడా దీన్ని గుడ్డిగా నమ్మేసి ఇతరులకు షేర్ చేయడం ద్వారా కరోనాపై భయాందోళనలు కలిగిస్తున్నారు.
అసలు నిజం ఇది!
వాస్తవానికి ఇటలీ ప్రజలు డబ్బులూ విసిరేయలేదు, పైగా ఈ ఫొటో ఆ దేశానికి సంబంధించినది కూడా కాదు. సోషల్ మీడియాలో ‘ఫేక్గాళ్లు’ సృష్టించిన ఫేక్ న్యూస్. ఈ వార్తను మీరు నమ్మి.. ముందుగానే ‘ఏప్రిల్ ఫూల్’ అయినట్లు. నిజానికి ఈ ఘటన మార్చి 2019న వెనిజులాలో చోటుచేసుకుంది.
నగదు రద్దు ఫలితంగా..
ఇండియా తరహాలోనే వెనిజులాలో కూడా పాత నోట్లను రద్దు చేసి, కొత్తవి ప్రవేశ పెట్టారు. దీంతో వృథాగా మారిన పా నగదుకు విలువ లేదనే ఉద్దేశంతో రోడ్లపైకి విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఈ ఫొటోలు ఏదో ఒక రూపంలో చక్కర్లు కొడుతూనే ఉంది. వెనిజులాలో ప్రజలు బ్యాంకును లూటీ చేశారని, ఆ డబ్బును ఇలా రోడ్డు మీద పాడేసి తగలబెట్టారనే ప్రచారం కూడా సాగింది.
సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజాలు కాదు
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను అస్సలు నమ్మవద్దు. జనాలను ‘ఫూల్స్’ చేసేందుకు ఫేక్గాళ్లు ఇలాంటివి చేస్తుంటారు. ప్రజలను భయాందోళనలకు గురిచేయడమే వీరి లక్ష్యం. మరి, వీరి ఉచ్చులో పడి మీరు రోజూ ఫూల్స్ అవుతారో, లేదా తెలివిగా వ్యవహరిస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది. పైగా, ఫేక్ వార్తలను గ్రూపుల్లో షేర్ చేయడం వల్ల మీపై పోలీసులు చర్యలు తీసుకొనే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కరోనా చికిత్స, మందులు తదితర విషయాలపై ఏ సమాచారాన్ని షేర్ చేసినా జైల్లో గడపాల్సిందే.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.