యాప్నగరం

తెలంగాణలో డోనాల్డ్ ట్రంప్ విగ్రహం.. పాలాభిషేకంతో పూజలు!

డోనాల్డ్ ట్రంప్‌కు విగ్రహం ఏర్పాటు చేయడమే కాదు.. ఏకంగా దానికి పూజలు కూడా చేస్తేస్తున్నాడు. ఇంతకీ ఎవరీ వ్యక్తి?

Samayam Telugu 18 Jun 2019, 9:20 pm
మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశంలోనే కాదండోయ్.. మన రాష్ట్రంలో కూడా అభిమానులు ఉన్నారు. వీరిని అభిమానులు అనడం కంటే భక్తులని పిలవడమే బెటర్. ఎందుకంటే.. వారంతా ఏకంగా ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. పాలాభిషేకంతో ఆ విగ్రహానికి పూజలు కూడా నిర్వహించారు. ఆ భక్తులు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే, చూడండి.
Samayam Telugu 3-1560857851


తెలంగాణలోని జనగాం జిల్లాలోని బుస్సా కృష్ణకు ట్రంప్‌కు వీరాభిమాని. ట్రంప్‌ను దేవుడిగా కొలిచే కృష్ణ.. ఆయన ఫొటోను దేవుడి గదిలో పెట్టుకుని మరీ పూజలు నిర్వహించడం గమనార్హం. ఉదయాన్నే నిద్రలేవగానే అతడు ట్రంప్ ఫొటోకు పసుపు రాసి, బొట్టు, పూలు పెట్టి పూజలు చేస్తాడు. హారతి కూడా ఇస్తాడు.
ఫిబ్రవరి 2017లో అమెరికాలోని కన్సాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభట్ల హత్య అనంతరం కృష్ణ.. ట్రంప్‌‌ను ఆరాదించడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘శ్రీనివాస హత్య నన్ను ఎంతో బాధించింది. భారతీయులు ప్రేమ, ఆప్యాయతల గురించి అమెరికా ప్రజలకు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియజేయాలని నిర్ణయించుకున్నా. అందుకే, నేను ట్రంప్‌ను పూజిస్తున్నా. ఆయన నా ప్రార్థనలు చేరుతాయని భావిస్తున్నా’’ అని తెలిపాడు. తాను పబ్లిసిటీ కోసమే ఇదంతా చేయడం లేదని, అమెరికా-ఇండియా ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొలిపేందుకే ఈ ప్రయత్నమని తెలిపాడు. తాను ఏర్పాటుచేసిన 6 అడుగుల ట్రంప్ విగ్రహానికి ఇకపై రోజూ పూజలు చేస్తానని కృష్ణ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.