యాప్నగరం

పైనుంచి 3 రైళ్లు వెళ్లినా బతికాడు.. పోలీసులకు మందుబాబు షాక్!

అతడి మీద నుంచి మూడు రైళ్లు దూసుకెళ్లాయి. పట్టాలపై శవం ఉందని వెళ్లి చూసిన పోలీసులకు అతడు ఊహించని షాకిచ్చాడు. లేచి కూర్చొని వారితో కామెడీ చేశాడు.

Samayam Telugu 23 Oct 2019, 5:41 pm
మందుబాబులు చేసే చేష్టలు భలే క్రేజీగా ఉంటాయి. కొందరు ఎంత తాగినా తమని తాము కంట్రోల్ చేసుకుంటారు. ఇంకొందరు కొంచెం తాగినా భారీ హంగామా చేస్తారు. ఇదిగో ఈ మందుబాబుది కూడా ఇదే బాపతు. ఫుటుగా మద్యం తాగి ఒళ్లు తెలియకుండా రైల్వే పట్టాలపై నిద్రపోయిన అతడి మీద నుంచి వరుసగా మూడు రైళ్లు దూసుకెళ్లాయి.
Samayam Telugu GettyImages-92375455


Also Read: ఏం తెలివి గురూ.. బీరుతో మంటలను ఆర్పేసిన మందుబాబు!

మధ్యప్రదేశ్‌ పోలీసులకు లోకోమోటివ్ పైలట్ (రైలు డ్రైవర్) నుంచి ఫోన్ వచ్చింది. అశోక్‌నగర్ రైల్వే ట్రాక్ మీద ఓ వ్యక్తి శవం పడి ఉందని తెలిపాడు. ఇప్పటికే మూడు రైళ్లు అతడి మీద నుంచి వెళ్లాయన్నాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పట్టాలపై ఉన్న వ్యక్తిని చూసి చనిపోయాడని భావించారు. దగ్గరకు వెళ్లి చూస్తుండగా ఆ వ్యక్తి అకస్మాత్తుగా పైకి లేచి హిందీలో.. ‘‘పాపా ఆగయే (నాన్న వచ్చాడు)’’ అన్నాడు. దీంతో పోలీసులు షాకయ్యారు.

Also Read: రూ.100 కోసం.. మర్మాంగాన్ని కొరికేసిన మందుబాబు

పోలీసులు ఆ వ్యక్తిని ధర్మేంద్రగా గుర్తించారు. తాగిన మత్తులో అతడు పట్టాలపైనే నిద్రించాడని తెలిపారు. అయితే, అతడు పట్టాల మధ్యలో కదలకుండా పడుకోవడం వల్ల ఎలాంటి గాయాలు తగల్లేదన్నారు. అతడి మీద నుంచి మూడు రైళ్లు వెళ్లాయనే సంగతి కూడా అతడికి తెలియలేదని తెలిపారు. అతడి ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షల తర్వాత ఇంటికి పంపేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.