యాప్నగరం

శ్రీలంక ఉగ్రదాడులు.. ఈఫిల్ టవర్ ‘చీకటి’ నివాళులు!

శ్రీలంకలో ఉగ్రదాడులపై ఈఫిల్ టవర్ లైట్లు ఆర్పేసి సంతాపం.

Samayam Telugu 22 Apr 2019, 4:04 pm
శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 290కు చేరింది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం 500 మంది తీవ్రంగా గాయపడినట్టు పోలీస్ అధికార ప్రతినిధి సోమవారం ఉదయం తెలిపారు. ఈ నరమేధంలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పిస్తూ పారీస్‌లోని ఈఫిల్ టవర్‌‌పై విద్యుత్ దీపాలను ఆర్పేశారు.
Samayam Telugu 190421181305-eiffel-tower-d ngrab-exlarge-169


గతంలో కూడా పలు ఉగ్రదాడుల్లో చనిపోయినవారికి నివాళులు అర్పిస్తూ ఈఫిల్ టవర్‌ను చీకటిమయం చేశారు. 2017, మేలో మంచేస్టర్‌లోని ఎరియాన గ్రాండే కన్సర్ట్‌పై ఉగ్రదాడి, 2015 నవంబరులో పారీస్‌లోని ఆరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉగ్రదాడులకు నిరసనగా ఈఫిల్ టవర్‌పై విద్యుత్తు దీపాలను ఆపేసి సంతాపం ప్రకటించారు.
ఆదివారం ఈస్టర్ సండేను పురస్కరించుకుని చర్చిల్లో ప్రార్థనలకు వచ్చే క్రైస్తవులు, విదేశీ పర్యటకులు తాకిడి ఎక్కువగా ఉండే హోటల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఆరు చోట్ల బాంబులు పేల్చారు. కొలంబో పేలుళ్లలో 40 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు.
ఈ దాడుల వెనుక ఐసీస్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాల్దీవుల నుంచి బంగ్లాదేశ్ వరకు వివిధ సందర్భాల్లో జరిగిన ఉగ్రదాడులతో సంబంధాలు కలిగిన ఐసీస్ శ్రీలంకలోనూ విస్తరించి ఉండవచ్చని భావిస్తున్నారు. తమిళనాడులో ఉనికి చూపుతున్న తౌహీద్ జమాత్ పాత్ర కూడా ఈ దాడుల వెనుక ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.