యాప్నగరం

వీడియో.. ఏనుగు ఎంత పనిచేసింది.. ఆలయ ఉద్యోగిని కింద పడేసి..!

ఏనుగులు తరచూ ప్రజలపై దాడులు చేస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. గజాలను జాగ్రత్తగా పెంచే కేరళలో అప్పుడప్పుడూ ఏనుగులు రెచ్చిపోతున్నాయి. దాడులు చేస్తున్నాయి.

Samayam Telugu 25 Sep 2021, 3:14 pm
జనరల్‌గా ఏనుగులకు కోపం రాదు. అవి ఎవరిపైనా దాడి చెయ్యాలి అనుకోవు. వీలైనంతవరకూ అవి ప్రశాంతంగానే ఉంటాయి. కానీ ఏనుగుకు కోపం వస్తే మాత్రం కంట్రోల్‌లో అస్సలు ఉండదు. ఆ క్షణం అది ఏం చేస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటిదాకా దాన్ని పెంచిన వాళ్లపైన దాడి చేసి చంపగలదు. అందుకే ఏనుగులతో జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇళ్లలో పెంపుడు జంతువుల్లా పెంచుకోవడం సరికాదని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. అందుకు తగ్గట్టే ఏనుగులు అప్పుడప్పుడూ మనుషులపై దాడులు (elephant attack video) చేస్తున్నాయి. తాజాగా కేరళలో అదే జరిగింది (viral video).
Samayam Telugu ఏనుగు దాడి (image credit - youtube -  Varthaanam)


గురువారం తిరువిల్వమాల విల్వాద్రినాథ ఆలయంలో ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయింది (Kerala elephant video). తనపై ఎక్కి కూర్చున్న ఆలయ సిబ్బందిని అటూ ఇటూ ఊపి కింద పడేసింది. కాలితో తొక్కి చంపబోయింది. అదృష్టం కొద్దీ కింద పడగానే అతను దొర్లుతూ తప్పించుకొని పారిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది (Elephant video)

ఆ ఏనుగు పేరు అదత్తు పరము అకా పనాచెర్రీ పరమేశ్వరమ్. ఎందుకిలా ప్రవర్తించిందో ఎవరికీ అర్థం కాలేదు. ఏనుగు ఎక్కిన కునిసెరి స్వామినాథన్ షాకయ్యాడు. అటూ ఇటూ ఊపేస్తుంటే... ఏనుగుపై ఉండలేక పట్టు తప్పి పడిపోయాడు. ఏనుగు ప్రవర్తన అందర్నీ భయపెట్టింది.

ఆ వీడియోని ఇక్కడ చూడండి:


ఈ ఆలయంలో కచ్చా సీవేలీ (Kazcha Seeveli) వేడుక జరుపుతున్నప్పుడు ఇలా అయ్యింది. బాధితుణ్ని ఆస్పత్రికి తరలించారు. అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి.

వీడియో.. భూకంపాన్ని ముందే కనిపెట్టిన పిల్లి.. ఏం చేసిందంటే!

కేరళలో ఏనుగులు (kerala elephants) దాదాపు ప్రముఖ ఆలయాలన్నింటా ఉంటాయి. వాటికి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి పెంచుతారు. అలాగే వాటికి రిటైర్మెంట్ కూడా ఉంటుంది. తాజా ఘటన తర్వాత దాత్తు పరమును అటవీ అధికారులు (Forest officers) కంట్రోల్ లోకి తీసుకున్నారు. దాదాపు గంటపాటూ వారిని ఏడిపించి... అప్పుడు వారి మాట విన్నాది. ఈ ఆగ్రహ గజం... ఆలయం దగ్గరి దీపస్థంభాన్ని కూడా నాశనం చేసిందని తెలిసింది.

భవిష్యత్తును ముందే చెప్పేది.. పోలీసులు అరెస్టు చేశారు.. ఎందుకో తెలుసా?

గతేడాది యోగా గురు బాబా రాందేవ్ (baba ramdev) ఇలాగే ఏనుగు అంబారీ ఎక్కారు. మథురలోని రమణరతి ఆశ్రమంలో యోగా ప్రాక్టీస్ నేర్పేందుకు ఆయన అక్కడికి వచ్చారు. ఏనుగుపై యోగా చేస్తుంటే... అది కుదిపేసింది. దాంతో ఆయన కిందపడ్డారు. వెంటనే లేచి నవ్వుతూ పక్కకు వెళ్లారు. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.