యాప్నగరం

76 ఏళ్లుగా అన్నపానీయాలు ముట్టని ఆ బాబా కన్నుమూత

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం ఈయన రహస్యాన్ని తెలుసుకోడానికి ప్రయత్నించి విఫలయ్యారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.

Samayam Telugu 26 May 2020, 7:31 pm
76 ఏళ్లుగా అన్నపానీయాలు ముట్టకుండా సైన్సుకు సైతం సవాల్ విసిరిన 90 ఏళ్ల యోగి ప్రహ్లాద్ జాని మంగళవారం ఉదయం కన్నుమూశారు. గుజరాత్‌ మెహసానా జిల్లా చరోడ్ గ్రామానికి చెందిన ప్రహ్లాద్ జానీ కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటూ జీవించారు. భక్తులంతా ఆయన్ని ‘చునిర్వాలా మాతాజీ’ అని పిలిచేవారు. వైద్యులను, పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచిన ఆయనపై ఇప్పటి వరకు ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ, ఆ రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు.
Samayam Telugu చునిర్వాలా మాతాజీ


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం ఈయన రహాస్యాన్ని తెలుసుకోడానికి ప్రయత్నించి విఫలయ్యారు. 2010లో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెనస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రహ్లాద్‌ను పూర్తిగా పరీక్షించారు. ఆయను 15 రోజులు పాటు ఒంటరిగా ఉంచి, చుట్టు కెమేరాలు పెట్టి ఆయన జీవన శైలిపై నిఘా పెట్టారు.

వైద్య రంగంలో అందుబాటులో ఉన్న అల్ట్రాసౌండ్, ఎమ్ఆర్ఐ, సిటీ స్కాన్ వంటి అన్నిరకాల ఆధునిక పరికరాలతో ఆయన్ని పరీక్షించారు. చివరికి ఆయన సాధారణ వ్యక్తికాదని తెలుసుకున్నారు. ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలు ఆయనలో ఉన్నాయని గుర్తించారు. ప్రహ్లాద్ మృతతదేహాన్ని రెండు రోజుల పాటు బనస్కంతలోని ఆశ్రమంలో భక్తుల సందర్శన కోసం ఉంచనున్నారు. గురువారం (మే 28న) అదే ఆశ్రమంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆహారం తినకుండా అన్నేళ్లు జీవించడం వెనుక గల రహస్యంపై బాబా ఏం చెప్పారో తెలుసుకొనేందుకు ఈ కింది కథనాన్ని క్లిక్ చేసి చదవండి.

Also Read: వామ్మో.. 76 ఏళ్లుగా తిండి, నీళ్లు లేకుండా బతికేస్తున్న బాబా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.