యాప్నగరం

Har Ghar Tiranga : స్వాతంత్ర్య దినోత్సవానికి జోరుగా ఏర్పాట్లు .. సముద్రంలో జెండా వందనం

Har Ghar Tiranga : 75వ స్వాతంత్ర్య దినోత్సవాలకు భారతావని సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దేశ భక్తిని చాటేందుకు అటు కేంద్రంతోపాటూ.. ఇటు రాష్ట్రాలూ కుడా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో దేశభక్తిని చాటే కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్రం లోపల జెండా వందనం డెమో చెయ్యడం స్వాతంత్ర్య దినోత్సవాలకు సరికొత్త ఊపు తెచ్చింది. మరి ఆ వీడియోని మనం కూడా చూద్దాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 2 Aug 2022, 5:44 pm
Har Ghar Tiranga : 75వ స్వాతంత్ర్య దినోత్సవాలకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరం నుంచి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆజాదీకా అమృత హమోత్సవం పేరుతో వీటిని వేర్వేరు రాష్ట్రాల్లో అమలు చేసింది. తాజాగా హర్ ఘర్ తిరంగా అనే పిలుపును ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఆగస్ట్ 13, 14, 15 ఈ మూడు రోజులూ ఏం చెయ్యాలో ప్రజలకు సందేశం ఇచ్చారు. ఇదే సమయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు కూడా ఈసారి వేడుకల్ని అత్యంత ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నాయి. తాజగా ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard)... సముద్రం లోపల నీటిలో ఫ్లాగ్ డెమో (Underwater Flag Demo) నిర్వహించారు. ఇది కూడా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ లో భాగమే. అందుకు సంబంధించిన వీడియో.. దేశం మొత్తాన్నీ కదిలిస్తోంది. ప్రజల్లో దేశ భక్తిని అది తట్టి లేపుతోంది. వారంతా జెండా పండుగ త్వరగా రావాలని ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు.. 3 రోజులు ఇళ్ల దగ్గర జెండా ఎగరేసేందుకు వారు సిద్ధమవుతున్నారు.
Samayam Telugu har ghar tiranga campaign indian coast guard performs flag demo under sea
Har Ghar Tiranga : స్వాతంత్ర్య దినోత్సవానికి జోరుగా ఏర్పాట్లు .. సముద్రంలో జెండా వందనం

(image credit - twitter - IndiaCoastGuard)


ఉప్పొంగే దేశభక్తి

ఈ వీడియోని ఇండియన్ కోస్ట్ గార్డ్.. జులై 29, 2022న ట్విట్టర్ లోని తమ అకౌంట్ IndiaCoastGuard లో పోస్ట్ చేశారు. దీన్ని ఇప్పటివరకూ 6.8 వేల మందికి పైగా చూడగా... 463 మంది లైక్ చేశారు. "75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా.. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ అండర్ వైటర్ ఫ్లాగ్ డెమోను సముద్రంలో నిర్వహించింది. ప్రజల్లో దేశభక్తిని తట్టి లేపడమే లక్ష్యంగా ఇది నిర్వహించింది" అని ట్వీట్ లో తెలిపారు. దీన్ని గమనిస్తే కోస్ట్ గార్డులు సముద్రంలోపలికి వెళ్లి... నీటిలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. నీటిపైన జెండాను ఎగరేస్తూ రెపరెపలాడించిన దృశ్యాల్ని మనం చాలా చూశాం. ఇది నీటిలోపల నిర్వహించడం వల్ల వైరల్ అయ్యింది.

(image credit - twitter - IndiaCoastGuard)

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

భారీ ఎత్తున హర్ ఘర్ తిరంగా ప్రచారం

ఈసారి ఆగస్ట్ 15న ప్రతి ఇంట్లోనూ జెండా రెపరెపలాడాలి అని కోరుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ఉద్ధృతంగా నిర్వహిస్తోంది. మొన్ననే మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ క్యాంపెయిన్ గురించి మాట్లాడారు. ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు దేశ ప్రజలందరూ తమ సోషల్మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్‌గా జాతీయ జెండా ఫొటో పెట్టుకోవాలని ప్రధాని కోరారు. అలాగే... ఆగస్టు 13 నుంచి 15 వరకు 'హర్ఘర్ తిరంగా' పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నామన్న మోదీ... ఆ మూడు రోజులు.. ప్రతి ఇంటి దగ్గరా... జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు.

(image credit - twitter - IndiaCoastGuard)

ప్రధాని మోదీ మన్ కీ బాత్ వీడియోని ఇక్కడ చూడండి

సమరయోధులకు జయహో

దేశ ప్రజలు ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతుండటం అనేది మహోన్నత ఘట్టం కావడంతో... వారిలో దేశభక్తి ఉప్పొంగుతోంది. మన ముందు తరాల వారు తెల్లారి లేస్తే.. ఉద్యమమే ఊపిరిగా బతికారు. బ్రిటీష్ వారితో పోరాటి ప్రాణ త్యాగాలు చేశారు. దాదాపు 200 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి పోరాడటం వల్లే ఈ రోజున ఇండియా స్వేచ్ఛా వాయువులు పీల్చుతోంది. సమరయోధులకు మనం ఏం ఇచ్చినా రుణం తీరదు. కనీసం ఇలాంటి దినోత్సవాల ద్వారా నైనా... వారి పట్ల గౌరవభావాన్ని చాటుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

(image credit - twitter - IndiaCoastGuard)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.