యాప్నగరం

స్కూటీ సీటుపై దోసలు, బజ్జీలు.. వేసవిలో గ్యాస్ ఆదా ఇలా!

ఇంత ఎండను వేస్ట్ చేయకండి. ఇదిగో ఇలా దోశలు, బజ్జీలు వేయండి. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోలు చూడండి.

Samayam Telugu 7 May 2019, 5:02 pm
దయం 11 గంటలు దాటిందంటే చాలు.. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయట కాలు పెట్టడానికే వణికిపోతున్నారు. అయితే, నెటిజనులు ఎండను కూడా వాడేసుకుంటున్నారు. జోకులతో నవ్విస్తున్నారు. ఎండల తీవ్రతను చెప్పేందుకు క్రియేటీవ్‌గా ఆలోచిస్తున్నారు.
Samayam Telugu summereffect0405


చౌకీదార్ షాలినీ బాజ్‌పేయ్.. అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎండ తీవ్రత చెప్పేందుకు ఓ వ్యక్తి యాక్టివా సీటు మీద దోసలను వేశాడు. వేడి తీవ్రతకు త్వరగానే దోస సిద్ధమైపోయింది. మరో వీడియోలో ఓ మహిళ నూనెతో నింపిన మూకుడును బయట మేడపై పెట్టింది. సూర్యుడి వేడికి అది వేడెక్కగానే అందులో బజ్జీలు వేసింది. వారు కావాలనే అలా చేశారా లేదా నిజమా అనే విషయాలను పక్కన పెడితే.. ఎండ తీవ్రత దంచికొడుతుందనేది మాత్రం వాస్తవం అని ప్రజలు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.