యాప్నగరం

లక్కీ లేడీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరరాలైపోయిన గృహిణి, ఎలాగంటే..

పంజాబ్‌కు చెందిన మహిళ రాత్రికి రాత్రే కోటీశ్వరరాలైపోయింది. రూ.100లతో కొనుగోలు చేసిన లాటరీ ఆమె జీవితాన్నే మార్చేసింది. రూ.కోటి లాటరీ మొత్తంతో తమ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయని ఆమె తెలిపింది.

Samayam Telugu 26 Feb 2021, 10:02 am
క్ ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం కదూ. తీవ్ర పేదరికం ఎదుర్కొనేవారిని సైతం లక్ ఒక్కసారే ధనవంతులుగా మార్చేస్తుంది. ఇదిగో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన గృహిణి జీవితం కూడా రాత్రికి రాత్రే మారిపోయింది. వంద రూపాయలు ఆమెను కోటీశ్వరాలిని చేసింది. ఇదిగో ఇలా..
Samayam Telugu Representational Image


రేణు చౌహాన్ అనే మహిళ తన జీవితంలో తొలిసారి రూ.100తో పంజాబ్ స్టేట్ డియర్ 100+ మంథ్లీ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 11న ప్రకటించిన ఫలితాల్లో ఆమె ఏకంగా రూ.కోటి గెలుచుకుంది. గురువారం ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌, సంబంధిత డాక్యుమెంట్లు అందించింది.

Read Also: భోజనానికి పిలిచి హత్యలు.. 12 మందిని ముక్కలు చేసి, ఇంట్లోనే పూడ్చేశాడు.. చిన్న తప్పుతో దొరికేశాడు

ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘‘D-12228 విన్నర్ రేణు ఈ రోజు తన డాక్యుమెంట్లను అందించింది. ఆమె గెలుచుకున్న మొత్తం త్వరలోనే అకౌంట్లో పడుతుంది’’ అని తెలిపారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రేణు.. సంతోషానికి అవధుల్లేవు. ఈ డబ్బుతో తన కష్టాలో తీరిపోతాయని తెలుపుతోంది. ‘‘నా భర్త అమృత్‌సర్‌‌లో దుస్తుల దుకాణాన్ని నడుపుతున్నారు. ఈ లాటరీ టికెట్‌తో మా అప్పులు తీరిపోతాయి. వ్యాపారానికి సైతం ఉపయోగపడతాయి’’ అని తెలిపింది.

Read Also: ఈ ఆంటీ యమ డేంజర్.. ఇంటికి పిలిచి హత్యలు.. శవాలతో కేకులు, సబ్బుల తయారీ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.