If People Refuse Quarantine Face Jail Or Heavy Fine Under Strict Coronavirus Rules
Covid 19: కరోనా వైరస్.. ఈ రూల్ పాటించకపోతే రూ.91 వేలు జరిమానా, జైలు శిక్ష
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు బాధితులపై కఠినంగా వ్యవహరించనున్నాయి. ఈ సందర్భంగా కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాయి.
Samayam Telugu16 Mar 2020, 6:17 pm
Covid-19 నేపథ్యంలో ప్రపంచమంతా హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య క్రమేనా తగ్గుతుంటే.. ఇతర దేశాల్లో మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నారు. మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చైనా తరహాలోనే కొన్ని కఠిన నిబంధనలను పాటించాలని నిర్ణయించుకున్నాయి. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను నిర్బంధించి మరీ చికిత్స అందించేలా నిబంధనలు విధించారు. ప్రస్తుతం కరోనా చైనా, ఇటలీలనే కాదు.. యూకేను సైతం వణికిస్తోంది. ఆదివారం నాటికి యూకేలో సుమారు 35 మంది మరణించారు. దీంతో యూకే హెల్త్ సెక్రటరీ మ్యాట్ హ్యాంకాక్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 70 ఏళ్ల వయస్సు పైబడినవాళ్లు బయటకు రావద్దని ఆదేశించారు. అలాగే, ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతున్న బాధితులను తప్పకుండా నిర్బంధించి చికిత్స విధించాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు వదలకూడదని పేర్కొన్నారు.
రూ.91 వేలు జరిమానా లేదా జైలు శిక్ష
కోవిడ్-19పై పోరాటానికి యూకే ప్రభుత్వం హెల్త్ ప్రొటెక్షన్ (కరోనా వైరస్) రెగ్యులేషన్స్ 2020 అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరిలోనైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లయితే.. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ఐసోలేషన్ వార్డులో పెట్టాలి. లేదా ఇంటి వద్దే ఐసోలేషన్ ఏర్పాట్లు చేయాలి. మొండికేస్తే నిర్బంధించి మరీ చికిత్స అందించాలి. వారు అక్కడికి నుంచి పారిపోకుండా భద్రత ఏర్పాటు చేయాలి. ఐసోలేషన్కు సహకరించకుండా తప్పించుకొనే బాధితులకు భారీ జరిమానా విధిస్తామని పేర్కొంది. చికిత్సకు నిరాకరిస్తే వెయ్యి పౌండ్లు (సుమారు రూ.91 వేల పౌండ్లు) జరిమానా లేదా జైలు శిక్ష తప్పదు.
కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకినా..
ఎవరికైనా కరోనా వైరస్ నిర్ధరణ జరిగితే.. వారి కుటుంబ సభ్యులందరిని ఐసోలేషన్లో ఉంచాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది. అంతా ఒకే చోట సమావేశం కావడంపైనా ఆంక్షలు విధించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం యూకే ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 1,372 మంది ఈ వైరస్తో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చనే సందేహాలున్నాయి. గత 24 గంటల్లోనే 14 మంది కరోనా బాధితులు చనిపోవడంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కరోనా నేపథ్యంలో యూకేలోని సినిమా హాళ్లను మూసివేశారు. ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవలసి ఉంది.
కరోనా వైరస్ నుంచి మానవాళిని రక్షించడానికి శాస్త్రవేత్తలు ఓ వ్యాక్సిన్ను సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ను జంతువులపై మాత్రమే ప్రయోగించారు. అయితే, వైరస్ ప్రభావం ఎక్కువగా మనుషులపైనే ఉన్న నేపథ్యంలో వైద్యులు సోమవారం నుంచి మనుషులపై ప్రయోగించాలని నిర్ణయించినట్లు సమాచారం. కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధించి పరిశోధనలు సియాటెల్లోని కైసేర్ పెరామనెంట్ వాషింగ్టన్ హెల్త్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ ప్రయోగానికి నిధులు సమకూరుస్తోంది. ఈ వ్యాక్సిన్ పనితీరును వెంటనే తెలుసుకోలేమని, ఇది పూర్తిగా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోడానికి మరో 18 నెలలు వేచిచూడాలని పబ్లిక్ హెల్త్ అధికారులు తెలిపారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 45 మంది యువకులపై ఈ వ్యాక్సిన్ని ప్రయోగిస్తారు. వీరికి ఒక్కొక్కరికి వేర్వేరు మోతాదులో వ్యాక్సిన్ను ఇస్తారు. ఇది కేవలం క్లినికల్ ట్రయల్స్ మాత్రమేనని, వీటి వల్ల బాధితులకు ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.