యాప్నగరం

టాయిలెట్ నీటితో ఇడ్లీ, చట్నీ.. తింటే అంతే సంగతులు!

టేస్ట్ బాగుంది కదా అని స్ట్రీట్ ఫుడ్‌ను బాగా లాగిస్తున్నారా? అయితే, జాగ్రత్త.. ఈ వ్యాపారిలా టాయిలెట్ నీటిని వాడే ప్రమాదం ఉంది.

Samayam Telugu 1 Jun 2019, 1:24 pm
రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్‌లో ఆహారం తింటున్నారా? అయితే, జాగ్రత్త! డబ్బులిచ్చి మరీ రోగాలను కొనితెచ్చుకొనే ప్రమాదం ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ వ్యాపారి మొక్కలకు పోసే నీళ్లతో లెమన్ వాటర్ తయారు చేసి విక్రయిస్తున్న వీడియో ఒకటి వైరలయిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబయిలోని బొరివాలీ రైల్వే స్టేషన్‌లో కూడా ఓ ఇడ్లీ వ్యాపారి అలాంటి పనే చేశాడు.
Samayam Telugu idli


చట్నీ కోసం అతడు అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్‌లోని నీటిని పట్టుకుని తీసుకొస్తూ కెమేరాకు చిక్కాడు. ఓ స్థానిక యువకుడు అతడిని అనుసరించి వీడియో తీయడం వల్ల ఈ విషయం బయటపడింది. వీడియో తీస్తున్నట్లు తెలియగానే ఆ వ్యాపారి నీటిని టాయిలెట్‌లో పారబోసి తిరిగి ఇడ్లీ దుకాణానికి వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఫుడ్ అండ్ డ్రక్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) విచారణ ప్రారంభించింది. అపరిశుభ్రమైన నీటిని ఆహారం తయారీకి ఉపయోగించవద్దని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసింది. కలుషిత నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని సూచించారు. మీకు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే వెంటనే ఎఫ్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.