యాప్నగరం

Independence Day Special : తాజ్ మహల్ కి త్రివర్ణ కాంతులేవి? ఎందుకు డెకరేట్ చెయ్యలేదు?

Independence Day Special : ఆగస్ట్ 15 లేదా జనవరి 26 వస్తే.. దేశంలోని ప్రముఖ కట్టడాలన్నీ విద్యుత్ కాంతులతో జిగేల్ మంటాయి. కానీ తాజ్ మహల్ మాత్రం ఎప్పట్లాగే ఉంటుంది. పాలరాయి మెరుపులే తప్ప త్రివర్ణ కాంతులు కనిపించవు? ఎందుకిలా? తాజ్‌కి డెకరేషన్ వద్దా? కేంద్ర ప్రభుత్వం, టూరిజం విభాగం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయా? తాజ్ మహల్ ని మనం త్రివర్ణ పతాక రంగుల విద్యుత్ కాంతులతో చూడలేమా? ఎందుకిలా? ప్రేమ సౌధానికి పండగ నాడు కూడా పాత కాంతేనా?

Authored byKrishna Kumar | Samayam Telugu 10 Aug 2022, 1:54 pm
Independence Day Special : ప్రస్తుతం దేశం మొత్తం పండుగల ఫీవర్‌ లోకి వెళ్లిపోయింది. నిన్నేగా మొహర్రం జరిగింది. రేపు రాఖీ. తర్వాత స్వాతంత్ర్య దినోత్సవం, నెక్ట్స్ వినాయకచవితి.. ఇలా వరుసగా ఫెస్టివల్స్ ఉన్నాయి. ప్రస్తుతం రాఖీ పూర్ణిమ, ఆగస్ట్ 15 కోసం దేశ ప్రజలు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న దేశానికి... 76వ ఇండిపెండెన్స్ డే ని అత్యంత ఘనంగా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరం నుంచి ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. (Azadi ka Amrit Mahotsav) ఈమధ్యే హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) పేరుతో ప్రతి ఇంటా జెండా ఎగిరేలా చేస్తూ... ప్రత్యేక వెబ్ పోర్టల్ కూడా తెరిచింది. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రముఖ చారిత్రక కట్టడాలకు త్రివర్ణ రంగుల విద్యుత్ లైట్స్ (tricolour theme) అమర్చారు. కొన్ని చోట్ల త్రీడీ లేజర్ కూడా సెట్ చేశారు. అంతా బాగానే ఉన్నా... ప్రపంచంలోనే అత్యంత సుందర కట్టడం, ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ మాత్రం రొటీన్ గా ఉంది. ఎప్పట్లాగే పాలరాతి మెరుపులే తప్ప... త్రివర్ణ శోభ లేదు. ఎందుకిలా?
Samayam Telugu Independence Day Special
తాజ్ మహల్ కి త్రివర్ణ కాంతులేవి? ఎందుకు డెకరేట్ చెయ్యలేదు? (image credit - pexels.com)


తాజ్ మహల్ తోనే ప్రారంభం :
ఇండియాలో ఇలా చారిత్రక కట్టడాలకు రంగుల లైట్స్ సెట్ చేయడం అనేది ప్రారంభమైనదే తాజ్ మహల్ తో. 77 ఏళ్ల కిందట... రెండో ప్రపంచ యుద్ధంలో అలీన దేశాలు గెలిచిన సందర్భంలో తొలిసారి తాజ్ ని రకరకాల రంగుల లైట్లతో అలంకరించారు. అప్పట్లో ఈ ప్రపంచ వింత కట్టడం లోపల భారీ వేడుక జరిపారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇలాగే డెకరేషన్ చేస్తూ వచ్చారు. చివరిసారిగా మార్చి 20, 1997 రాత్రి తాజ్ మహల్ రంగుల లైట్లలో దర్శనమిచ్చింది. ప్రముఖ పియానిస్ట్ యాన్నీ (Yanni) షో కోసం ఈ అలంకరణ చేశారు. కానీ తెల్లారి షాకింగ్ న్యూస్ తెలిసింది. పాలరాతి కట్టడం పైన రకరకాల దీపపు పురుగులు చనిపోయి కనిపించాయి. రాత్రంతా అవి కట్టడంపై వాలి.. చనిపోవడంతో.. తెల్లని పాలరాళ్లు కాస్తా.. రంగు మారినట్లైంది.

ఈ విషయం దేశంలోని తాజ్ ప్రేమికులకు విచారం కలిగించింది. భారత పురాతత్వ శాఖ (Archaeological Survey of India)కి చెందిన రసాయన విభాగం (Chemical Wing).. దీనిపై చర్యలు తీసుకుంది. ఇకపై రాత్రివేళ తాజ్ మహల్ దగ్గర లైట్లు వెలిగించవద్దు అని ఆర్డరేసింది. ఐతే.. ప్రస్తుతం తాజ్ దగ్గర మంచి లైటింగ్ ఆప్షన్ ఉంది. అయినప్పటికీ.. 1997 నాటి నిషేధం ఇప్పటికీ అమల్లోనే ఉంది. అందువల్ల తివర్ణ రంగుల కాంతులు అక్కడ కనిపించట్లేదు.

ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ చేసిన ప్రకటనతో... ఆగస్ట్ 5 నుంచి 15 వరకూ.. దేశంలో భారత పురావస్తు శాఖ పర్యవేక్షిస్తున్న అన్ని కట్టడాలూ, మ్యూజియం లను భారతీయులు, విదేశీయులూ ఉచితంగా సందర్శించవచ్చు. ఈ కారణంగా... ఇప్పుడీ కట్టడాలకు సందర్శకుల సంఖ్య పెరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.