యాప్నగరం

ఇజ్రాయెల్ నోట ‘ఓం నమ శివాయ’.. ఇండియా కోసం ప్రజలు ప్రార్థనలు

భారత ప్రజలు త్వరగా కరోనా వైరస్ నుంచి కోలుకోవాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఇజ్రాయెల్ ప్రజలు నగరం ప్రధాన కూడలిలో ప్రార్థనలు నిర్వహించారు. పరమేశ్వరుడి స్మరిస్తూ ఇండియా కోసం ప్రార్థనలు జరిపారు.

Samayam Telugu 7 May 2021, 9:07 pm
రోనా వైరస్ మన దేశాన్ని ఎంతగా వణికిస్తుందో తెలిసిందే. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వైరస్‌కు గురైన ప్రజలు హాస్పిటళ్లలో ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నారు. కొందరికైతే హాస్పిటల్స్‌లో కనీసం బెడ్ కూడా దొరకడం లేదు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇండియాను ఆదుకోడానికి తమకు తోచిన సాయం చేస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ముందుకొస్తున్నాయి. అంతేకాదు.. వైరస్ నుంచి ఇండియా కోలుకోవాలని ఆయా దేశాల ప్రజలు ప్రార్థిస్తున్నారు.
Samayam Telugu Image Credit: pawank90/Instagram


ఇజ్రాయెల్‌లో ‘ఓం నమః శివాయః’ అంటూ ప్రజలు ఇండియా కోసం పరమేశ్వరుడిని స్మరిస్తున్నారు. ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ అధికారి పవన్ కె పాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇటీవల ఈ వీడియో పోస్టు చేశారు. వందలాది ఇజ్రాయెల్ ప్రజలు టెల్ అవీవ్‌లోని ప్రధాన కూడలిలో శివలింగాలను ఏర్పాటుచేసి మరీ ‘ఓం నమ శివాయ’ అంటూ ప్రార్థనలు జరపడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఇంటికి నిప్పు పెట్టి.. గార్డెన్‌లో పుస్తకం చదువుతూ కూర్చున్న మహిళ.. ఇంట్లో మరొకరు ఉండగానే..
వైరస్‌తో విలవిల్లాడుతున్న ప్రజలను కాపాడాలని కోరుతూ పరమేశ్వరుడిని స్మరిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారతీయ నెటిజనులు ఇజ్రాయెల్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు చేసిన ఈ కార్యక్రమం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, త్వరలోనే ఇండియా కోవిడ్ నుంచి ముక్తి పొందాలని కోరుకుంటున్నామని కామెంట్లలో తెలుపుతున్నారు.

వీడియో:
View this post on Instagram A post shared by Pawan K Pal 🇮🇳 (@pawank90)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.