యాప్నగరం

దారుణం.. 4వ తరగతి విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపాల్, టీచర్ అత్యాచారం

4వ తరగతి అమ్మాయిపై వైస్ ప్రిన్సిపాల్, టీచర్ అత్యాచారానికి పాల్పడ్డారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ చిన్నారికి నరకం చూపించారు.

Samayam Telugu 9 Sep 2019, 6:38 pm
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్లే.. కీచకులయ్యారు. 4వ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన జార్ఖండ్‌లోని దన్బాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కత్రాస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల కిందట బాధితురాలు కడుపు నొప్పితో బాధపడింది. దీంతో ఆమెను ‘సిక్ రూమ్’కు తీసుకెళ్లారు.
Samayam Telugu rape-child2_1478239130


Read also: బాలికపై గ్యాంగ్ రేప్.. బాధితురాలి జుట్టు కత్తిరించి, గ్రామంలో ఊరేగించిన పెద్దలు!

‘సిక్ రూమ్’లో ఉన్న బాధితురాలికి నర్సు మత్తు మందు ఇవ్వడంతో స్పృహ తప్పింది. అనంతరం ఆ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్, టీచర్‌ అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి బాధితురాలి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. వైద్యులు ఆమె అత్యాచారానికి గురైనట్లు సందేహంగా ఉందని తెలిపారు. దీనిపై బాధితురాలిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 164 కింద స్థానిక కోర్టులో బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఆదివారం పాటలిపుత్ర మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Read also: అది కోసి కుక్కలకు వేసింది.. భర్తను దారుణంగా చంపిన భార్య

వైస్ ప్రిన్సిపాల్, టీచర్, నర్సులపై పోస్కో తదితర చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ‘సిక్ రూమ్’లో ఎప్పుడూ విద్యార్థులతో నిండి ఉంటుంది. అక్కడ అలాంటి చర్యకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. పోలీసుల విచారణకు సహకరిస్తాం’’ అని తెలిపారు.

Read also: అప్పుడే పుట్టిన శిశువు తలను చిదిమేసి.. గార్డెన్‌లో పూడ్చిపెట్టిన చీర్‌గర్ల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.