Man Asks If He Needs Permit To Move Between Houses Of 2 Wives During Coronavirus Lockdown
ప్లీజ్, నాకు ఇద్దరు భార్యలు.. లాక్డౌన్లో అందుకు అనుమతిస్తారా? పోలీసులకు భర్త వింత ప్రశ్న!
లాక్డౌన్ నేపథ్యంలో ఇద్దరు భార్యలున్న భర్తల పరిస్థితి ఇది. ఈ భర్త అడిగిన ప్రశ్నకు పోలీసులు తొలుత షాకైనా.. ఆ తర్వాత ఫన్నీగా సమాధానం ఇచ్చారు.
Samayam Telugu8 Apr 2020, 7:27 pm
లాక్డౌన్ వల్ల చాలామంది ఇప్పుడు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్లు విడిచి బయటకు వస్తున్నారు. అవసరం లేకుండా బయటకు వెళ్లి పోలీసులతో దెబ్బలు తినడం, జరిమానాలు చెల్లించడం కంటే ఇంట్లో ఉండటమే శ్రేయస్కరం అని భావిస్తున్నారు. ఈ పరిస్థితి కేవలం ఇండియాలోనే కాదు.. బయట దేశాల్లో కూడా ఉంది. రోజుల తరబడి ఇంట్లో ఉండటం కష్టమైనా.. కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడిపేందుకు సమయం దొరకడంతో సరిపెట్టుకుంటున్నారు. అయితే, అందరి పరిస్తితి ఒకేలా ఉండదు. ఒకరికి ఒకే కుటుంబం ఉంటే.. ఇంకొందరికి వేర్వేరు కుటుంబాలు ఉంటాయి. ముఖ్యంగా ‘చిన్న ఇళ్లు’ ఉండేవారు ఒకే ఇంట్లో ఉండటం చాలా కష్టం. అందుకే ఓ భర్త తన కష్టాన్ని పోలీసులకు చెప్పుకున్నాడు.
నా భార్యల ఇళ్లకు తిరిగేందుకు అనుమతివ్వండి
ఇటీవల దుబాయ్ పోలీసులు.. కరోనా వైరస్పై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు రేడియోలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి తన గోడు వెళ్లబుచ్చుకున్నాడు. తనకు ఇద్దరు భార్యలనీ.. లాక్డౌన్ వల్ల ఒకే భార్య దగ్గర ఉండిపోయానని, రెండో భార్య తనని మిస్ అవుతుందని చెప్పాడు. మీరు (పోలీసులు) అనుమతిస్తే రెండిళ్ల మధ్య తిరుగుతానని కోరాడు.
నవ్వుతూ చురకలేసిన పోలీసులు
ఆ భర్త అడిగిన ప్రశ్నకు పోలీసులు తొలుత షాకయ్యారు. ఆ తర్వాత నవ్వుతూ.. ‘‘నిన్ను కలిసేందుకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదని చెప్పండి. ఒక వేళ మీ మనసులో ఆమెను కలిసేందుకు ఇష్టం లేదనట్లయితే, మీకు ఇంతకంటే మంచి సాకు ఏం దొరుకుతుంది చెప్పండి’’ అని సెటైర్ వేశారు. అయితే, పోలీసులు ఇలా అనేందుకు మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం దుబాయ్లో అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. అది కూడా ఒక్కసారి మాత్రమే. ఒక వేళ అతడికి రెండో భార్యను కలిసేందుకు అనుమతిచ్చినా.. మొదటి భార్యను కలిసేందుకు అనుమతి దొరకదు. ఆ ఉద్దేశంతోనే పోలీసులు ఉన్న చోటు నుంచి కదలకని పరోక్షంగా చెప్పారు.
ఒక్కసారి బయటకు వదిలినా డేంజరే
ఈ సందర్భంగా ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయీ మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్ నేపథ్యంలో అత్యవసర అవసరాల కోసం కేవలం ఒకసారి మాత్రమే అనుమతి ఇస్తున్నాం. ఈ నేపథ్యంలో రోజూ ఇలాంటి కాల్స్ చాలానే వస్తున్నాయి. చాలామంది వీక్లి పర్మి్ట్లు కావాలని కోరుతున్నారు. లాక్డౌన్ విధించిందే ప్రజలు బయటకు రాకూడదని. ఇలాంటి సమయంలో వీక్లీ పర్మిట్ ఇచ్చినా సరే వైరస్ వ్యాపిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉంటున్నాం’’ అని తెలిపారు. యూఏఈలో ఇప్పటివరకు 2,300 కరోనా కేసులు నమోదుకాగా 12 మంది చనిపోయారు. 186 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.