యాప్నగరం

‘దున్నపొతు’ పెట్టిన చిచ్చు.. భార్య కాళ్లను నరికేసిన భర్త

దున్నపోతు అమ్మకంపై దంపతుల మధ్య గొడవ.. కాళ్లు నరికేసిన భర్త.

Samayam Telugu 14 Mar 2019, 12:36 am
దున్నపోతు.. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది. గొడవ ముదిరి చివరికి భార్య కాళ్లనే నరికే వరకు వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని లింగాలపాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.పిచ్చయ, అతని భార్య రాజేశ్వరి మధ్య నిత్యం గొడవులు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి దున్నపోతు అమ్మకం విషయంలో గొడవ పడ్డారు.
Samayam Telugu 1552470315-Axeblood-Getty


ఇద్దరి మధ్య గొడవ తీవ్రం కావడంతో పిచ్చయ్య గొడ్డలితో భార్య రాజేశ్వరి కాళ్లను నరికేశాడు. ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పిచ్చయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం నందిగామ ఆసుపత్రిలో రాజేశ్వరి చికిత్స పొందుతోంది. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పిచ్చయ్య కుమార్తె మాట్లాడుతూ.. ‘‘దున్నపోతు విషయంలో రాత్రి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత నాన్న గొడ్డలిని నీటిలో నానబెట్టమని చెప్పాడు. అర్థరాత్రి అమ్మ గట్టిగా కేకలు పెట్టడం చూశాను. కళ్లు తెరిచి చూసేసరికి అమ్మ కాళ్లు రెండు నరికేసి ఉన్నాయి’’ అని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.