యాప్నగరం

మండుటెండల్లో ‘మత్వాలే’ లస్సీ.. భలే టేస్ట్ గురూ!

మండే ఎండల్లో మాంచి రుచికరమైన లస్సీ తాగాలని ఉందా? అయితే, వెంటనే ఛార్మినార్‌లోని ఈ షాప్‌కు వచ్చేయండి. ఈ లస్సీ తప్పకుండా మీకు నచ్చేస్తుంది.

Samayam Telugu 14 May 2019, 1:25 pm
మండే ఎండల్లో మాంచి లస్సీ తాగితే ప్రాణం హాయిగా ఉంటుంది కదూ. అయితే, ఇంకెందుకు ఆలస్యం ఛార్మినార్ సమీపంలోని మత్వాలే దూద్ ఘర్‌కు వచ్చేయండి. వేసవి వచ్చిందంటే చాలు.. లస్సీ ప్రియులంతా ఇక్కడికే వాలిపోతారు. సుమారు 52 ఏళ్లుగా ఇక్కడ నాణ్యమైన లస్సీని విక్రయిస్తున్నారు.

షాపు యజమాని మహ్మద్ మత్వాలే స్పందిస్తూ.. ‘‘1967 నుంచి ఇప్పటివరకు అత్యుత్తమమైన లస్సీని వినియోగదారులకు అందిస్తున్నాం. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి మా లస్సీ తాగేందుకు వస్తుంటారు. తరతరాలుగా నాణ్యతలో రాజీపడకుండా పనిచేస్తుండటం వల్ల వినియోగదారుల విశ్వాసం చూరగొన్నాం. మధుమేహం వ్యాధిగ్రస్తులు సైతం తాగేందుకు వీలుగా ఇక్కడ సుగర్‌లెస్ లస్సీని విక్రయిస్తున్నాం’’ అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.