యాప్నగరం

TikTok Video: బతికున్న కొండ చిలువకు నిప్పు పెట్టి.. పైశాచిక ఆనందం

దారుణం.. టిక్‌టాక్ వీడియో కోసం కొందరు బతికున్న కొండ చిలువకు నిప్పు పెట్టి చంపేశారు. నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.

Samayam Telugu 19 Oct 2019, 6:49 pm
గ్రామంలోకి చొరబడిన ఓ కొండ చిలువను కొందరు దారుణంగా హింసించి చంపేశారు. బతికుండగానే దాన్ని నిప్పుల్లో పడేసి పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియోను టిక్‌టాక్‌లో పెట్టి.. అడ్డంగా బుక్కయ్యారు. గుజరాత్‌లోని బోదల్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Samayam Telugu Representational Image  (GettyImages )


Read also:
వామ్మో, కొండ చిలువ.. మెడను చుట్టేసి, మింగేసేదే! కేరళాలో ఘటన

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆ కొండ చిలువను పట్టుకున్న వ్యక్తులను వివరాలను సేకరించారు. నలుగురు నిందితుల్లో ఇద్దరి వ్యక్తులను గుర్తించారు. అయితే, వారిద్దరూ పరారిలో ఉన్నారు.

వీడియో:
ఈ సందర్భంగా అసిస్టెంట్ డిస్టిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ బిందు పటేల్ మాట్లాడుతూ.. ‘‘నలుగురు నిందితుల్లో ఇద్దరిని గుర్తించాం. వారిద్దరూ పరారిలో ఉన్నారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టంలో కొండ చిలువను షెడ్యూల్-1 జంతువుగా గుర్తించారు. దానికి హాని కలిగించేవారిపై సెక్షన్ 9 కింద కేసు నమోదు చేస్తాం. నేరం రుజువైతే నిందితుడికి మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు నుంచి రూ.25 వేలు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. నిందితులను పట్టుకొనేందుకు అటవీ శాఖ ఐదు బృందాలను ఏర్పాటు చేసింది’’ అని తెలిపారు.

Read also: దోపిడీ చేస్తూ.. వృద్ధురాలికి ముద్దు పెట్టిన దొంగ, డబ్బులూ తీసుకోలేదు!
Photo: Representational Image (GettyImages )

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.