యాప్నగరం

కూలీలా? పురుగులా? విమానాల్లో వచ్చేవారిపైనా ఇలా స్ప్రే చేయగలరా?

కూలీలపై రసాయనాలు చల్లుతున్నారు సరే.. విమానాల్లో కరోనాను మోసుకున్న సంపన్నులతో ఇలా ప్రవర్తించగలరా?

Samayam Telugu 23 May 2020, 3:48 pm
పేదలుగా పుట్టడమే వాళ్లు చేసిన తప్పు. నిజాయతీగా పొట్ట నింపుకోవడం కోసం వలస వెళ్లడం కూడా నేరమే. అందుకే, వాళ్లంటే అందరికీ చిన్న చూపు. విదేశాల్లో ఉండే సంపన్నులను విమానాల్లో తీసుకొచ్చి మరీ రాచమర్యాదలు చేసే అధికారులు.. వలస కూలీలతో మాత్రం పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్‌ను ఇండియాకు దిగమతి చేసిన ఆ పెద్దలను వదిలి పేదలతో పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. నడి రొడ్డుపై పురుగులు మందు చల్లినట్లుగా రసాయనాలు చల్లుతున్నారు. తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్ ఈ ఘటన మరోసారి చర్చనీయంగా మారింది.
Samayam Telugu వలస కూలీలపై రసాయనాలు చల్లుతున్న సిబ్బంది


శ్రామిక్‌ రైలులో ఢిల్లీకి వచ్చిన వలస కూలీలు కరోనా పరీక్షల కోసం లజ్‌పత్‌ నగర్‌ స్కూలు వద్ద క్యూలో నిలుచున్నారు. వారంతా అధికారులకు పురుగుల్లా కనిపించారో ఏమో.. వెంటనే రసాయనాలను స్ప్రే చేసి తడిపేశారు. దీంతో వారి బ్యాగ్గులు, దుస్తులు, మొబైల్ ఫోన్లు తడిచిపోయాయి. ఆ రసాయనం కళ్లల్లో పడటంతో విలవిల్లాడారు. వాస్తవానికి ఆ రసాయనాలను రోడ్డుపై చల్లేందుకు తీసుకొచ్చారు. కానీ, సిబ్బంది మాత్రం కూలీలను తడిపేందుకు వాడింది. అలాంటి రసాయనాలు మనుషులపై పడితే శ్వాసకోశ, చర్మ వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నా ఇలాంటి చర్యలకు పాల్పడటం న్యాయమేనా?

వీడియో:
మున్సిపాలిటీ సిబ్బంది రసాయనాలు చల్లినా వలస కూలీలు ఎదురు తిరగలేదు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజలు అధికారులను తిట్టిపోస్తున్నారు. దీనిపై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC) వివరణ ఇచ్చింది. పైపుల్లో లోపం వల్ల అలా జరిగిందని కవరింగ్ చేసే ప్రయత్నం చేసింది. అయితే, వీడియోలో కూలీలపై రసాయనాలు చల్లుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని నెటిజనులు వాదించడంతో.. నాలుక కరుచుకుని క్షమాపణలు చెప్పింది.

Also Read: ఖాళీ రోడ్డుపై దొర్లుతూ యువతి టిక్‌టాక్.. చివరికి జైలుపాలు!Also Read: చెట్టు కనిపిస్తే చాలు తల బాదుకోవడమే.. ఐదేళ్లుగా అతడికి అదే పని!undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.