యాప్నగరం

కోవిడ్‌తో పసిబిడ్ద తల్లి మృతి.. తమ రొమ్ము పాలిచ్చి ఆదుకున్న మహిళలు

కరోనా వైరస్ వల్ల ఆ పసిబిడ్డ తల్లి ప్రసవం తర్వాత ప్రాణాలు కోల్పోయింది. సాధారణ పాలతో అలర్జీ రావడంతో మహారాష్ట్రలోని మహిళలు స్వయంగా తమ చనుబాలను ఆ బిడ్డకు పంపి మానవత్వం చాటారు.

Samayam Telugu 29 May 2021, 5:15 pm
పాపం పసిబిడ్డ.. పుట్టగానే తల్లిని కోల్పోయాడు. అరుదైన సమస్యతో ఆ బిడ్డ ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడింది. కేవలం తల్లి పాలు మాత్రమే అతడిని బతికించగలవని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి అతడి బిడ్డ చేసిన ప్రయత్నానికి విశేష స్పందన లభించింది. కొంతమంది బాలింతలు తమ రొమ్ము పాలు(చనుబాలు)ను బిడ్డకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు వారే ఆ బిడ్డకు తమ పాలను పిండి బాటిళ్లలో వేసి ఇచ్చేవారు. ఈ మానవీయ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
Samayam Telugu Representational Image


కోవిడ్‌ పాజిటివ్‌తో బాధపడుతున్న మినాల్ వెర్నేకర్ అనే 32 ఏళ్ల గర్భిణీ ఇటీవల నాగపూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేరింది. అత్యవసర పరిస్థితిలో వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి.. నెలలు నిండకుండానే బిడ్డను బయటకు తీశారు. ప్రసవం తర్వాత మినాల్ గుండె నొప్పితో చనిపోయింది. పసిబిడ్డ అలర్జీతో బాధపడటంతో తల్లిపాలు అవసరం పడ్డాయి. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు తెలియడంతో మహారాష్ట్ర నలుమూలల మహిళలు స్పందించారు. తమ పాలను హాస్పిటల్‌కు పంపి బిడ్డను రక్షించారు.

Read Also: ‘అన్నాబెల్లె’.. భయపెట్టే ఈ బొమ్మ రియల్ స్టోరీ తెలిస్తే గుండె ఆగుంది!

ఆ బిడ్డ తండ్రి చేతన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా భార్య ఏప్రిల్ 8న బిడ్డను కని చనిపోయింది. అయితే, ఫార్మలా మిల్క్ వల్ల బిడ్డ అలర్జీకి గురయ్యాడు. దీంతో వైద్యులు తల్లిపాలే పట్టించాలన్నారు. ఈ విషయం తెలిసి కొంతమంది మహిళలు ప్రతి రోజు నా బిడ్డకు తమ పాలను పంపేవారు. వారి మానవత్వం వల్లే నా బిడ్డ బతికాడు’’ అని తెలిపాడు.

Read Also: హైసెక్యూరిటీ జైలుకు చెంచాలతో కన్నం వేసి ఖైదీలు పరార్, ఇదో థ్రిల్లింగ్ మిస్టరీ!

అయితే, వారు బిడ్డ థానేలో ఉన్న ఇంటికి చేరిన తర్వాత కూడా బిడ్డకు తల్లిపాలు అవసరం పడింది. ఈ సందర్భంగా చేతన్ ఫేస్‌బుక్‌లోని ‘బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ ఉమెన్’ అనే పేజీ ద్వారా తమ సమస్యను తెలిపాడు. దీంతో ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అదునికా ప్రకాష్ చేతన్ బిడ్డకు సాయం చేయడానికి ముందుకొచ్చింది. అప్పటి నుంచి ఆ బిడ్డకు వివిధ ప్రాంతాల్లోని మహిళల నుంచి చనుబాలు అందుతూనే ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.