యాప్నగరం

తన పుట్టినరోజు సొమ్మును సైన్యానికి విరాళంగా ఇచ్చిన చిన్నారి!

పుల్వామాలో 44 జవాన్లు వీర మరణం వార్త విని ఆ చిన్నారి చలించిపోయింది. తన పుట్టిన రోజు రద్దుచేసుకుని.. డిబ్బీలోని సొమ్మును సైనిక నిధికి విరాళంగా ఇచ్చేసింది.

Samayam Telugu 17 Feb 2019, 10:08 pm
మ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో చోటుచేసుకున్న ఉగ్రదాడి యావత్ భారతావనిని విషాదంలో నింపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అమరులైన సైనికుల కుటుంబాన్ని ఆదుకోవడానికి భారతీయులంతా ఒక్కటయ్యారు. గత మూడు రోజుల్లో 82,716 మంది రూ.18.38 కోట్లు విరాళంగా అందించారు. చాలామంది తమ వ్యక్తిగత అవసరాలను, ఆడంబరాలకు స్వస్తి పలికి ఆ సొమ్మును సైన్యానికి విరాళంగా ఇస్తున్నారు.
Samayam Telugu 1550341428-Muskan_Ahirwar


మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌కు చెందిన ముస్కాన్ ఆశిర్వార్ అనే 11 ఏళ్ల చిన్నారి ఫిబ్రవరి 15న జరగాల్సిన తన పుట్టిన రోజును రద్దు చేసుకుంది. అంతేగాక, తాను దాచుకున్న డబ్బులన్నీ సైనిక నిధికి విరాళంగా ఇచ్చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘అక్కడ సైనికులు అమరులైతే నేను పుట్టిన రోజు ఎలా జరుపుకోగలను? అందుకే, పుట్టిన రోజు కోసం డిబ్బీలో దాచుకున్న డబ్బులను సైనికు నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నా. డిబ్బీలో మొత్తం రూ.680 ఉన్నాయి. నా స్నేహితుల నుంచి మరికొంత మొత్తాన్ని సేకరించి మొత్తం రూ.1,100 సైనిక కల్యాణ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చాను’’ అని తెలిపింది. అయితే, ముస్కాన్‌ చిన్న వయస్సు నుంచే సామాజిక సేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. మురికివాడల్లో పిల్లల కోసం తన ఇంట్లో ‘బాల పుస్తకాలయ’ పేరుతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.