యాప్నగరం

పంజాబ్: రెండు హత్యలు చేసిన జీవిత ఖైదీకి జైల్లోనే పెళ్లి!

ఆ జైలు అధికారులు పెళ్లి పెద్దలయ్యారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి జైల్లోనే పెళ్లి చేశారు.

Samayam Telugu 31 Oct 2019, 3:26 pm
పంజాబ్‌లోని నభా కారాగారంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీకి జైల్లోనే పెళ్లి చేశారు అధికారులు. మన్‌దీప్ సింగ్ అనే వ్యక్తి పదేళ్ల కిందట తమ గ్రామ సర్పంచిని, అతడి గన్‌మ్యాన్‌ను హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి మన్‌దీప్ సింగ్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు.
Samayam Telugu GettyImages


Also Read: ఒకే నెలలో 23 సార్లు పెళ్లి, విడాకులు.. తల్లీ, చెల్లినీ వదలని ఘనులు!

ఇటీవల మన్‌దీప్.. పెళ్లి చేసుకోడానికి పెరోల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే, భద్రతాపరమైన సమస్యలు వస్తాయని పోలీసులు చెప్పడంతో కోర్టు పెరోల్ నిరాకరించింది. జైలులోనే పెళ్లికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. పెళ్లి కుమార్తె పవన్ దీప్ సింగ్‌, ఇరు కుటుంబాల పెద్దలు ఆరు గంటలు జైలు పరిసరాల్లో గడిపేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా నభా జైలు అధికారులు బుధవారం (అక్టోబరు 31) మన్‌దీప్ సింగ్‌, పవన్ దీప్ సింగ్‌లకు పెళ్లి చేశారు. జైలులో గల గురుద్వారాలో ఈ వివాహ వేడుక నిర్వహించారు.

Also Read: ప్రియురాలి మృతదేహాన్ని పెళ్లాడిన ప్రియుడు.. గుండె బరువెక్కించే విషాదం

పవన్ దీప్ సింగ్ 2016లోనే మన్‌దీప్‌ ఫొటో చూసి పెళ్లికి అంగీకరించింది. అతడికి పెరోల్ రాగానే పెళ్లి చేసుకోవాలని భావించింది. గత మూడేళ్లుగా అతడి కోసం ఎదురుచూస్తోంది. మన్‌దీప్ సింగ్‌ తండ్రి చనిపోవడంతో తల్లి రాచ్‌పాల్ కౌర్ ఒంటరైంది. అతడి అక్కచెల్లెల్లు విదేశాల్లో ఉండటంతో తల్లి బంధువుల ఇంట్లో ఉంటోంది. ఈ పెళ్లికి అతడి తల్లి కూడా హాజరైంది. పెళ్లి కూతురు వెంట ఆమె తల్లి, సోదరుడు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.