యాప్నగరం

అంతరిక్షం నుంచి హిమాలయాలు ఇలా.. ఢిల్లీ జిగేల్, నాసా అద్భుత చిత్రాలు వైరల్

నాసా అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఈ చిత్రాలను చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ చిత్రాల్లో హిమాలయాలతోపాటు రాత్రివేళ వెలుగులీనుతున్న దేశ రాజధాని ఢిల్లీని కూడా చూడవచ్చు.

Samayam Telugu 17 Dec 2020, 5:01 pm
హిమాలయాలు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ట్రావెలింగ్‌ను ఇష్టపడే వ్యక్తులు, ప్రకృతి ప్రేమికులకు హిమాలయాలను సందర్శించడమనేడి ఒక కల. అయితే, మనం హిమాలయాలను ఇప్పటివరకు నేలపై నుంచి మాత్రమే చూసి ఉంటాం. అయితే, నాసా (National Aeronautics and Space Administration - NASA) సరికొత్త కోణంలో హిమాలయాలను ప్రపంచానికి చూపించింది. అంతరిక్షం నుంచి హిమాలయాలు ఎంత అందంగా కనిపిస్తాయో చూడండి అంటూ.. అరుదైన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Samayam Telugu Image Credit: NASA


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station - ISS) తీసిన ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్టులో నాసా హిమాలయాల ప్రత్యేకతను కూడా తెలిపింది. హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవని, గత 50 మిలియన్ ఏళ్లుగా భూమి పొరల్లో కలుగుతున్న మార్పు చేర్పుల వల్ల ఇవి రూపొందినట్లు పేర్కొన్నారు.

Read Also: తండ్రి జైల్లో, తల్లి వదిలేసింది.. పెంపుడు కుక్కతో ఫుట్‌పాత్‌పై బాలుడి నిద్ర.. కదిలిస్తున్న చిత్రం!

ఈ చిత్రంలో ఉత్తర భారత దేశంతోపాటు పాకిస్థాన్‌లోని కొంత భాగాన్ని కూడా చూడవచ్చని తెలిపింది. రాత్రి వేళ తీసిన ఈ చిత్రంలో దేశ రాజధానితోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెలుగు జిలుగులను సైతం చూడవచ్చు. మరి.. ఇంకెందుకు ఆలస్యం? ఆ చిత్రాన్ని చూసేయండి మరి.
View this post on Instagram A post shared by NASA (@nasa)

Read Also: నమ్మండి.. ఇవి జైలు గదులు.. ఫైవ్ స్టార్ హోటల్ కాదు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.