యాప్నగరం

ఆగస్ట్ 15 ‘బ్లాక్ డే’.. పాక్ ఆర్మీకి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన భారత సైన్యాధికారి

ఇండియాను అవమానిద్దామనుకున్న ఆ పాకిస్థాన్ సైన్యాధికారికి.. భారత మాజీ సైన్యాధికారి వేసిన ‘పంచ్’కు పాక్ పళ్లు రాలాయి.

Samayam Telugu 17 Aug 2019, 3:00 pm
భారత స్వాతంత్ర్య దినోత్సవం పాకిస్థాన్‌కు ‘బ్లాక్’ డే అంటూ నోరు పారేసుకున్న ఆ దేశ ఆర్మీ అధికారికి.. భారత మాజీ సైన్యాధికారి దిమ్మతిరిగే జవాబు ఇచ్చి నోరు మూయించారు. దీంతో భారత నెటిజన్లు జోహార్ అంటూ ఆయన్ని పొగిడేస్తున్నారు. ఆగస్టు 15 నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu article_370_1565853029


ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఈ ఏడాది పాకిస్థానీల ఉక్రోషం మరింత ఎక్కువైంది. భారతీయులను ట్రోల్ చేస్తూ పాకిస్థానీలు ట్వీట్ల యుద్ధం ప్రారంభించారు. ఇందులో భాగంగా పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్ ఘఫూర్ భారత స్వాతంత్ర్య దినోత్సవానికి కొన్ని నిమిషాల ముందు ‘‘150 నిమిషాలు.. బ్లాక్ డే‌కు కౌంట్‌డౌన్ మొదలైంది’’ అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు స్పందించిన మాజీ సైన్యాధికారి మేజర్ గౌరవ్ ఆర్య.. ‘‘నాన్నకు శుభాకాంక్షలు చెప్పవా?’’ అని పంచ్ పేల్చారు. దీంతో భారత నెటిజనులు.. వక్ర బుద్ధి పాక్‌కు భలే సమాధానం ఇచ్చారంటూ గౌరవ్ ఆర్యను మెచ్చుకుంటున్నారు. ఆగస్టు 14న పాకిస్థాన్ ఇండియా నుంచి విడిపోయిన తెలిసిందే. దీంతో పాక్‌కు జన్మనచ్చిందే ఇండియా అంటూ భారతీయులు ట్రోల్ చేస్తున్నారు.
Read also: కశ్మీర్‌పై పాకిస్థానీకి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన అద్నాన్ సమీ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.