యాప్నగరం

మోదీని విమర్శిస్తుండగా పాక్ మంత్రికి కరెంట్ షాక్, వీడియో వైరల్!

మోదీ మాట ఎత్తగానే పాకిస్థాన్ రైల్వే మంత్రికి కరెంట్ షాక్ కొట్టింది. మరి, ఇండియా జోలికి వస్తే ఏమవుతుందో!

Samayam Telugu 30 Aug 2019, 8:10 pm
ప్రధాని నరేంద్ర మోదీపై నిత్యం నోరుపాడేసుకొనే పాకిస్థాన్ మంత్రికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. సరిగ్గా మోదీని విమర్శిస్తున్నప్పుడే ఆయనకు కరెంట్ షాక్‌కు గురికావడం చర్చనీయమైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్.. త్వరలో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ఉంటుందని జోస్యం చెప్పారు. అంతేకాదు, అవసరమైతే తానే కదన రంగంలోకి దిగి పోరాడతానంటూ ఆవేశపడ్డారు.
Samayam Telugu Untitledsd


భారత్‌ను ఎంత ఎక్కువ విమర్శిస్తే.. అంత ఎక్కువగా పాక్ ప్రజలకు దగ్గరకు కావచ్చనే ఫార్ములాను పాటించే మంత్రి రషీద్.. శుక్రవారం జరిగిన ఓ బహిరంగ సభలోనూ పాత పాటే పాడారు. ‘‘మోదీ వ్యూహం ఏమిటో మాకు తెలుసు..’’ అని కొన్ని సెకన్లలోనే అతని మైక్ షాక్ కొట్టింది. ఆ షాక్ నుంచి తేరుకున్న కొద్ది క్షణాల్లో మళ్లీ మోదీనే విమర్శిచారు. ‘‘ఈ కరెంట్ షాక్‌తో కూడా.. మోడీ ఈ సమావేశంలో పాల్గొన్న జనాల ఆకాంక్షలను దెబ్బతీయలేరు’’ అని కవరింగ్ ఇచ్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత నెటిజనులు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ‘‘మోదీ మాట ఎత్తితేనే షాక్ తగిలింది. ఇక ఇండియాతో పెట్టుకుంటే మీ గతి ఏమిటో ఆలోచించుకో’’ అంటూ మాటల యుద్ధం మొదలుపెట్టేశారు.

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.