యాప్నగరం

ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ఆ పాక్ మంత్రిపై గుడ్లతో దాడి, కొట్టింది పాకీలే!

ఇండియాపై అవాకు చెవాకులు పేలిన పాకిస్థాన్ రైల్వే మంత్రికి లండన్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆ దేశ పౌరలతోనే గుడ్లతో కొట్టించుకున్నాడు.

Samayam Telugu 23 Aug 2019, 7:33 pm
ర్టికల్ 370 రద్దు తర్వాత ఇండియాపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కిన పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌పై కొందరు గుడ్లతో దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు. లండన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇటీవల చర్చనీయమైంది. అయితే, అతడిపై దాడి చేసిన వ్యక్తులు భారతీయులు కాదు. పాకిస్థాన్‌ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కార్యకర్తలు.
Samayam Telugu pakistan_1566561681_725x725


ఇటీవల ఇండియాపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కిన రషీద్ అహ్మద్‌పై భారత నెటిజనులు గుర్రుగా ఉన్నారు. తాను భారత ముస్లిం సొదరుల గోడు వెల్లడించే గొంతుకనంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయన కొద్ది రోజులు మీడియాలో వైరల్ అయ్యాడు. అవామీ ముస్లిం లీగ్ (ఏఎంఎల్)‌కు అధ్యక్షుడి హోదాలో రషీద్ ఇటీవల లండన్ వెళ్లాడు. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత హోటల్ నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగాడు.
అతడి కోసం కాపు కాసిన పీపీపీ కార్యకర్తలు వెంటనే గుడ్లతో కొట్టి, ముఖంపై గుద్ది పారిపోయారు. రషీద్ అంగీకరిస్తే దాడిచేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏఎంఎల్ లండన్ అధ్యక్షుడు తెలిపాడు. ఈ విషయం తెలియగానే సోషల్ మీడియాలో భారతీయులు కామెంట్ల దాడి చేస్తున్నారు. ‘‘భారత ముస్లింల గురించి కాకుండా.. ముందు నీ దేశంలోని ప్రజల గురించి ఆలోచించు’’ అంటూ పంచులు విసురుతున్నారు. తమ నాయకుడిపై విమర్శలు చేస్తున్నందుకే రషీద్‌ను గుడ్లతో కొట్టామని, ఇంకేదీ చేయకుండా వదిలేసినందుకు అతడు సంతోషించాలని పీపీపీకి చెందిన ఓ ప్రతినిధి వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.