యాప్నగరం

రూ.500 విలువ చేసే మోదీ ఫొటో స్టాండ్‌.. రూ.కోటికి విక్రయం!

ఆ ఫొటో స్టాండ్ విలువ రూ.500 మాత్రమే ఉంటుంది. కానీ, ఆయన అభిమానులు దాని విలువను రూ.కోటికి పెంచేశారు.

Samayam Telugu 17 Sep 2019, 6:59 pm
ప్రధాని మోదీ మానియా మామూలుగా లేదు. ఆయన ఫొటో ఉంటే చాలు.. దాని విలువ రూపాయి ఉన్నా రూ.కోటి ధర పలుకుతుంది. ఇందుకు ఘటనే నిదర్శనం. మంగళవారం మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని.. గత ఆరు నెలల్లో ఆయనకు వచ్చిన బహుమతులను ఆన్‌లైన్లో వేలానికి పెట్టారు. మొత్తం 2,772 వస్తువులను ఇందులో ఉంచారు.
Samayam Telugu 1568717013-Modi1


Read also: కెమేరాకు అడ్డుగా ఉన్నాడని.. అధికారిని పక్కకు తప్పుకోమన్న ప్రధాని మోదీ

ఈ వస్తువుల్లో మోదీ చిత్రం, ఆయన గుజరాతీలోరాసిన సందేశంతో ఉన్న ఓ ఫొటో స్టాండ్‌ భారీ ధర పలికింది. రూ.500తో మొదలైన వేలం రూ.కోటికి చేరింది. దీనితోపాటు రూ.18 వేలు విలువ చేసే వెండి కలశం కూడా రూ.కోటి ధర పలికింది. ఈ కలశాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మోదీకి బహూకరించారు.

Read also: ఫుట్‌బాల్ పోటీలు చూడాలా? ఇప్పుడే సెక్స్ చేయండి.. ఫ్యాన్స్ వింత ప్రచారం

ఈ వస్తువులతోపాటు మోదీ సాలువా, పెయింటింగులు తదితర వస్తువులు కూడా మంచి ధర పలికాయి. పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వేలాన్ని నిర్వహించారు. ఈ వేలం ద్వారా వచ్చే సొమ్మును గంగా నది ప్రక్షాళన ప్రాజెక్టు కోసం ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.