యాప్నగరం

గాంధీ కళ్లల్లో రెడ్ లైట్స్.. ఆకతాయి చర్యలపై ఆగ్రహం

భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా దేశం కాని దేశంలో గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. ఓ ఆకతాయి మహాత్ముడి కళ్లలో రెడ్ ఎల్‌ఈడీ లైట్లు పెట్టి అవమానించాడు.

Samayam Telugu 10 Aug 2019, 3:22 pm
హత్మా గాంధీ విగ్రహానికి ఓ ఆకతాయి రెడ్‌ ఎల్‌ఈడీ లైట్లు అతికించి అవమానించాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకుంది. ఫెర్రీ బిల్డింగ్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం కళ్ల నుంచి ఎర్ర రంగు కాంతి వస్తున్న ఫొటోలు ‘రెడ్డిట్’ అనే సోషల్ మీడియా వెబ్‌సైట్‌ చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని విక్కీ వన్‌టైమ్ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు.
Samayam Telugu gandhi_statue_2


ఈ ఫొటోల్లో ఓ వ్యక్తి విగ్రహం దిమ్మ మీదకు ఎక్కి మహాత్ముడి కళ్లకు లైట్లు అతికిస్తున్నట్లు ఉంది. మరికొన్ని ఫొటోల్లో రాత్రి వేళ మహాత్ముడి కళ్లు ఎర్రగా మెరుస్తున్నట్లు ఉంది. ఈ ఫొటోలను చూసిన భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీని అవమానించారని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎనిమిది అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని జ్లాట్కో పౌనవ్, స్టీవెన్ లోవైన్ 1988లో తయారు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో ఫెర్రీ బిల్డింగ్‌ సమీపంలోని ప్లాజాలో గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. విగ్రహాం కళ్లజోడుకు ఏర్పాటుచేసిన కళ్లద్దాలను ఆకతాయిలు ఐదు సార్లు దొంగిలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.