యాప్నగరం

కొండ చిలువ అత్యాశ.. గొర్రెను మింగి కదల్లేక అవస్థలు, చివరికి..

ఓ కొండచిలువ గొర్రెను మింగేసి ముప్పు తిప్పలు పడింది. కదల్లేని పరిస్థితిలో రోడ్డు పైనే ఉండిపోయింది. ఆ గొర్రెను మింగలేక.. కక్కలేక అస్వస్థతకు గురైంది. దీంతో అటవీ అధికారులు దాన్ని తీసుకెళ్లి.. అడవిలో వదిలిపెట్టారు.

Samayam Telugu 29 Sep 2020, 7:36 pm
దురాశ దుఃఖానికి చేటని ఆ కొండ చిలువకు తెలియదు కాబోలు. కళ్ల ముందు నోరూరించే గొర్రె కనిపించేసరికి టెమ్ట్ అయ్యింది. వెంటనే దాన్ని లటుక్కున పట్టుకుని.. గుటుక్కున మింగేసింది. మింగే మింగిది, కానీ.. దాన్ని అరిగించుకోలేక తెగ ఇబ్బంది పడింది. ఎక్కడికి వెళ్లలేక రోడ్డు మీదే ఉండిపోయింది. అంత పెద్ద కడుపుతో కనిపించిన కొండ చిలువను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని ఆ కొండ చిలువను తమతో తీసుకెళ్లిపోయారు.
Samayam Telugu గొర్రెను మింగి కదల్లేకపోతున్న కొండ చిలువ


ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా సిహారి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చిన కొండ చిలువకు.. బాగా ఆకలి వేసిందో ఏమో ఓ గొర్రెను వేటాడి చంపేసింది. అనంతరం దాన్ని అమాంతంగా మింగేసింది. ఆ తర్వాత కదల్లేని పరిస్థితిలో అక్కడే ఉండిపోయి గ్రామస్థుల కంటికి చిక్కింది. అటవీ అధికారులు ఓ ట్రాక్టర్‌‌లోకి ఆ కొండ చిలువను ఎక్కించుకుని వెళ్లిపోయారు. మరి, దాని కడుపు నుంచి గొర్రెను బయటకు తీశారా.. అలాగే వదిలేశారా అనేది మాత్రం తెలియరాలేదు.
Read Also: అరటిపువ్వుతో వీర్యవృద్ధి కలుగుతుందా? ప్రయోజనాలేమిటీ?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.