యాప్నగరం

video: రైలు పట్టాలకు మంటలు.. వాటిపైనే రైళ్ల రాకపోకలు.. ఎందుకిలా?

ఆ రైళ్ల పట్టాలకు మంటలు ఎలా వ్యాపించాయి? దీనిపై అధికారులు ఏమంటున్నారు? రైలు సర్వీసులు ఎందుకు ఆపలేదు? మంటలున్న పట్టాలపై రైళ్లు ఎలా వెళ్తున్నాయి?

Samayam Telugu 29 Jan 2022, 11:19 am
రైలు పట్టాలకు మంటలు... అనే వార్త మన గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు? ఇలా వరుస ప్రశ్నలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కానీ అమెరికా... చికాగోలో... పట్టాలకు మంటలు అంటుకున్నా... ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతా కూల్ గా ఉన్నారు. ఐతే... ఈ వార్త దావానలంలా ప్రపంచమంతా వ్యాపించింది. వీడియో వైరల్ అయ్యింది. దాంతో మ్యాటరేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. (fire on railway tracks video)
Samayam Telugu పట్టాలకు మంటలు (image credit - twitter - @Metra)


ఇదీ మ్యాటర్:
చికాగోలో మెత్రా అనే ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్ సంస్థ ఉంది. అది చికాగో రైలు పట్టాలను నిర్వహిస్తోంది. ఆ సంస్థ తాజాగా పట్టాలకు మంట పెట్టింది. ఆ మంటలు ఉన్న పట్టాలపైనే రైళ్ల రాకపోకలు సాగాయి (railway tracks caught fire video).

సడెన్ గా ఈ మంటలు ఎందుకంటే... అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు బీభత్సంగా మంచు కురుస్తోంది. రైలు పట్టాలు కనిపించే పరిస్థితి లేదు. అలాగైతే రైలు సర్వీసులకు బ్రేక్ పడుతుంది కదా... దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థ... పట్టాలపై మంచును కరిగించేందుకు మంట పెట్టింది (chicago burning railway tracks video).

మంటకూ టెక్నాలజీ:
ఇక్కడ మంట అనగానే అగ్ని ప్రమాదానికి సంబంధించిన మంట కాదు. కంట్రోల్ తో కూడిన మంట. మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే... అక్కడి రైలు పట్టాల పక్కనే గ్యాస్ నింపిన హీటర్లు ఉంటాయి. పట్టాలపై మంచును కరిగించేందుకు ఆ హీటర్లు చిన్న చిన్న మంటల్ని చిమ్ముతాయి. అలాగే ట్యూబులర్ హీటింగ్ సిస్టం, హాట్ ఎయిర్ బ్లోయర్స్ ఉంటాయి. ఇవి కూడా వేడిని తెప్పించేవే. ఇలా రకరకాల మార్గాల్లో మంచును కరిగించేస్తున్నారు. అందువల్ల పట్టాలపై కనిపించే మంటలు చిన్నగానే ఉంటాయి. వాటి వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉండదని అక్కడి అధికారులు అంటున్నారు (train on burning tracks video).

ఆ మంటలపై ఓ ట్రైన్ వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ వీడియోని మెత్రా సంస్థ తన ట్విట్టర్ అకౌంట్ @Metraలో జనవరి 24న పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటివరకూ దాన్ని 5.76 లక్షల మందికి పైగా చూశారు. 4 వేల మందికి పైగా లైక్ చేశారు (chicago train video).

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

మంటలే ఎందుకు?
చలికాలంలో మైనస్ 1 డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగ్రత పడిపోయిన ప్రతిసారీ ఈ టెక్నాలజీని వాడుతున్నారు. "అతి చల్లదనంలో రైలు పట్టాలు పక్కలకు జరిగిపోతాయి. లోహం ముడుచుకుపోతుంది. దీని వల్ల రైలు సర్వీసులకు బ్రేక్ పడుతుంది. అలా జరగకుండా ఉండేందుకు మంటలు పెడతాం. ముడుచుకుపోయే లోహం తిరిగి సాధారణ స్థితికి వచ్చేవరకూ వేడి చేస్తాం. తద్వారా రెండు వైపులా పట్టాలు కనెక్ట్ అయి ఉంటాయి" అని మెత్రా సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తెలిపింది.

View this post on Instagram A post shared by Metra (@metrarail)

video: ఆ బైకర్ అదృష్టవంతుడు.. యమరాజు జాలి చూపించాడు..!
ఒక్కోసారి రైలు, రోడ్డు క్రాస్ ఉన్న చోట కూడా మంచు ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటి చోట కూడా హీటింగ్ వ్యవస్థలున్నాయి. పట్టాలకు మంటలు పెట్టాక... అవి చెలరేగకుండా... పర్యవేక్షించేందుకు సిబ్బంది ఉన్నారని మెత్రా తెలిపింది. "మంటలపై నుంచి రైళ్లు వెళ్లినా ఏమీ కాదు. ఎందుకంటే వాటిలో ఇంధనం... ఒత్తిడి, వేడి వల్ల మాత్రమే మండుతుంది... మంటల వల్ల మండదు" అని మెత్రా వివరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.