యాప్నగరం

ఉక్రెయిన్‌పై థెర్మోబారిక్ బాంబులు వేస్తున్న రష్యా.. అవేంటి? ఎలాంటివి?

థెర్మోబారిక్కా... అదేంటి? ఈ కొత్త కొత్త పేర్ల బాంబులేంటి? ఇన్నాళ్లూ వాటిని ఎందుకు ప్రయోగించలేదు? ఇప్పుడే ఎందుకు బయటకు తీసింది? ఈ బాంబులు ఎలాంటివి? వీటి వల్ల ప్రపంచ దేశాలకు సమస్య ఉందా? ఈ కొత్త బాంబుల వల్ల భూ వాతావరణం కాలుష్యంగా మారుతుందా? ఉక్రెయిన్‌తో పాటూ ఇతర దేశాల ప్రజలు కూడా చనిపోతారా? అసలు రష్యా ఏ ఉద్దేశంతో ఈ బాంబులు వేస్తోంది? ఇలా మనకు ఎన్నో డౌట్లు రావడం సహజం. కనీసం కొన్నైనా ఇప్పుడు తెలుసుకుందాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 27 May 2022, 9:35 am
ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) యుద్ధాన్ని మనం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే ఇది 21వ శతాబ్దంలో జరుగుతున్న ఆధునిక యుద్ధం. చేస్తున్నదేమో రష్యా. అది మామూలు దేశం కాదు.. అత్యంత పవర్‌ఫుల్ ఆయుధాల్ని తయారుచేసే దేశం రష్యా. కాబట్టి యుద్ధాన్ని ఎలాగైనా గెలిచేందుకు రష్యా ఎంతకైనా తెగించగలదు. అందుకే మెల్లమెల్లగా డోస్ పెంచుతోంది. 20 రోజుల కిందట థెర్మో లేజర్ కిరణాల ఆయుధాల్ని రంగంలోకి దింపిన రష్యా... తాజాగా... థెర్మోబారిక్ బాంబుల్ని (thermobaric bombs) ప్రయోగిస్తోంది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం... 3 నెలలు దాటినా కొనసాగుతూనే ఉంది (Russia war on Ukraine)
Samayam Telugu థెర్మోబారిక్ బాంబులు వేస్తున్న రష్యా (image credit - twitter - DaveAtherton20)


ఉక్రెయిన్ సేనలకు సాయం చేస్తున్న నాటో (NATO) దళాలు... అర్జెంటుగా రష్యా ప్రయోగిస్తున్నటువంటి బాంబుల్ని సప్లై చేయాలని ఉక్రెయిన్ ఆర్మీ కోరుతోంది. ఈ బాంబుల టెక్నాలజీ చిత్రంగా ఉంది. దీనిపై ఉక్రెయిన్ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. "రష్యా.. TOS-1 మల్టిపుల్ రాకెట్ లాంచర్‌తో తూర్పున ఉన్న నోవోమీఖైలీవ్కా దగ్గర దాడులు చేసింది" అని చెప్పింది. ఆ రాకెట్ లాంచర్ థెర్మోబారిక్ బాంబుల్ని వదలగలదు. ఈ బాంబులు... అత్యంత తీవ్రంగా ఎక్కువ వేడితో పేలేందుకు... చుట్టూ ఉన్న ఆక్సిజన్‌ని ఉపయోగించుకుంటాయి. అందువల్ల పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
viral: టాయిలెట్‌కి వెళ్లాడు.. అతని సీటుపై పాము కాటేసింది
థెర్మోబారిక్ బాంబులు అత్యంత ప్రాణాంతకమైనవని నిపుణులు అంటున్నారు. శత్రువుల స్థావరాల్ని నేలమట్టం చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవి గాలి మొత్తాన్నీ వాడేసుకుంటాయి. ఇవి పేలినప్పుడు గాలి మాయమవుతుంది. శత్రువులు గాలి పీల్చేందుకు ఆక్సిజన్ ఉండదు అని అంటున్నారు.
viral video: చిలిపి కోతి.. ఆమె దగ్గరకు వచ్చి అలా చేసింది
21వ శతాబ్దంలో ఇదే అతి పెద్ద యుద్ధం అని ఉక్రెయిన్ అంటోంది. తమకు మల్టిపుల్ రాకెట్ లాంచ్ వ్యవస్థలు ఇవ్వాలని నాటోను కోరుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కొత్త శాసనం చేశాడు. దాని ప్రకారం... రష్యా దళాలు ఆక్రమించిన ప్రాంతాల్లోని ఉక్రెయిన్లను... రష్యన్లుగా మార్చుకుంటామని తెలిపాడు. ఇది ఉక్రెయిన్ ప్రభుత్వానికి మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. అలాగే... రష్యా సైన్యంలో మరింత మంది చేరేందుకు కూడా పుతిన్ ఏర్పాట్లు చేశాడు.
viral video: వామ్మో.. మహా తెలివైన కుక్క.. ఓనర్ లేనప్పుడు ఏం చేసిందో చూడండి
ఫిబ్రవరి 24, 2022 నుంచి మే 26, 2022 వరకూ... 29,600 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. అలాగే రష్యాకి చెందిన 1,315 ట్యాంకులు, 3,235 యుద్ధ వాహనాలు, 617 ఆయుధ వ్యవస్థలు, 201 మల్టిపుల్ రాకెట్ లాంచ్ వ్యవస్థలు, 93 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలు, 206 యుద్ధ విమానాలు, 170 హెలికాప్టర్లు, 2,225 మోటర్ వాహనాలు, 13 వెస్సల్స్, 502 మనుషులు లేని ఏరియల్ వెహికిల్స్, 114 క్రూయిజ్ మిస్సైళ్లను తాము నాశనం చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.