యాప్నగరం

పదో తరగతి ఫలితాలు.. 63 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు!

తరగతిలో ఒక్కరు కూడా పాస్ కాలేదంటేనే ఆశ్చర్యపోతాం. అలాంటిది 63 సూళ్లలో ఒక్కరు కూడా 10 తరగతి పాస్ కాలేదంటే నేటి చదువులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Samayam Telugu 22 May 2019, 10:33 pm
క స్కూల్లో ఒకరో ఇద్దరో పరీక్షలు పాస్ కాలేదంటే అనుకోవచ్చు. కానీ, 63 స్కూళ్లలో ఏ ఒక్క విద్యార్థి పాస్ మార్క్ సాధించలేదంటే.. అక్కడ చదువులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం గుజరాత్ సెకండరీ, హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
Samayam Telugu 69406136


ఈ ఫలితాల్లో మొత్తం పాస్ పర్సంటేజ్ 66.97 మాత్రమే. గతేడాదిలో లభించిన 67.5 శాతం కంటే తక్కువ మంది ఈ ఏడాది పాసయ్యారు. బోర్డ్ ఛైర్మన్ ఏజే షా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పరీక్షలకు 8,22,823 మంది హాజరు కాగా.. కేవలం 5,51,023 మంది మాత్రమే పాసైనట్లు తెలిపారు.

63 పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి కూడా పాస్ మార్క్ తెచ్చుకోలేదన్నారు. బాలికలు 72.64 శాతం మంది పాస్ కాగా, బాలురు 62.83 శాతం పాసయ్యారని తెలిపారు. కేవలం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో మాత్రమే పాస్ పర్సంటేజ్ మెరుగ్గా ఉందన్నారు. ఇంగ్లీష్ మీడియంలో 88.11 శాతం, హిందీలో 72.66 శాతం, గుజరాతీ మీడియంలో 64.58 శాతం పాసయ్యారని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.