యాప్నగరం

ఓ మై గాడ్.. తండ్రి అస్థికలను బీరులో కలిపి.. కొడుకు ఏం చేశాడో చూడండి

ఓ వ్యక్తి కొడుకు, కూతురు.. తన తండ్రి అస్థికలు, తల వెంటుకలను పబ్‌కు తీసుకెళ్లారు. బీర్ ఆర్డర్ చేసి.. అస్థికలను అందులో కలిపారు. ఆ తర్వాత వాటిని డ్రైనేజీలో పోశారు. వారు అలా చేయడానికి గల కారణం తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.

Samayam Telugu 26 Feb 2021, 8:48 am
నిపోయిన ఆప్తుల అస్థికలను సముద్రం లేదా నదుల్లో కలుపుతారనే విషయం తెలిసిందే. యూకేలోని కావెంట్రీకి చెందిన ఓ వ్యక్తి తన తండ్రి అస్థికలను బీరులో కలిపాడు. అయితే, అతడు అంతటితో ఆగలేదు. అస్థికలు కలిపిన ఆ బీరును.. పబ్ డ్రైనేజీలో పోశాడు. అదేంటీ అతడికి ఏమైనా పిచ్చా? తండ్రి అస్థికలను అలా డ్రైనేజీలో పోయడం ఏమిటనేగా మీ సందేహం. అయితే, ఇందులో అతడి తప్పేమీ లేదు. అది అతడి తండ్రి ఆఖరి కోరిక.
Samayam Telugu Representational Image


కెవిన్ మెక్‌గ్లించే అనే వ్యక్తి చనిపోతూ తన కొడుకును వింత కోరిక కోరాడు. తాను మరణించిన తర్వాత ఆస్థికలను తనకు ఎంతో ఇష్టమైన హోలీబుష్‌ పబ్‌కు తీసుకెళ్లాలని, బీరులో వాటిని కలిపాలని తెలిపాడు. దీంతో కెవిన్ పుట్టిన రోజున కొడుకు ఒవెన్, కూతురు కాస్సిడేలు కలిసి ఆ పబ్‌కు వెళ్లారు. తండ్రి చెప్పినట్లే చేశారు. ఆ తర్వాత ఆ బీరును పబ్ ముందున్న డ్రైనేజీలో కలిపారు.

Read Also: భోజనానికి పిలిచి హత్యలు.. 12 మందిని ముక్కలు చేసి, ఇంట్లోనే పూడ్చేశాడు.. చిన్న తప్పుతో దొరికేశాడు

ఈ సందర్భంగా ఓవెన్ మాట్లాడుతూ.. ‘‘ఇది కొంచెం పిచ్చిగానే అనిపించవచ్చు. ఇది నా తండ్రి ఆఖరి కోరిక. ఆయన ఎప్పటికీ ఇక్కడే ఉంటారు. ఆయన ఎప్పుడూ తన అస్థికలను పబ్‌ డ్రైనేజీలోనే కలపాలని కోరేవాడు. అందుకే, ఇలా చేయాల్సి వచ్చింది’’ అని తెలిపాడు. అంతేకాదు.. కెవిన్ మరో వింత కోరిక కూడా కోరాడు. చనిపోయిన తర్వాత తన తల వెంటుకలను కూడా పబ్‌ డ్రైనేజీలో కలపాలని తెలిపాడు. అతడు చెప్పినట్లే అతడి కొడుకు, కూతురు అస్థికలతోపాటు కలిపారు.

Read Also: ఈ ఆంటీ యమ డేంజర్.. ఇంటికి పిలిచి హత్యలు.. శవాలతో కేకులు, సబ్బుల తయారీ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.