యాప్నగరం

యువతిని కోరిక తీర్చమన్న డెలివరీ బాయ్.. రూ.200 కూపన్ ఇచ్చిన స్విగ్గీ!

ఫుడ్ తీసుకొచ్చే డెలివరీ బాయ్.. ఆ కోరిక తీర్చమన్నాడు. ఈ విషయం ఫిర్యాదు చేస్తే.. స్విగ్గీ ఏం చేసిందో చూడండి.

Samayam Telugu 2 Apr 2019, 9:12 pm
న్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్‌పై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇటీవల కస్టమర్లకు ఇవ్వాల్సిన ఆహారాన్ని డెలివరీ బాయ్ మధ్యలోనే తినేయడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ డెలివరీ బాయ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ఆరోపించింది. స్విగ్గీకి ఫిర్యాదు చేస్తే.. రూ.200 కూపన్ ఇచ్చిందని పేర్కొంది.
Samayam Telugu 1554105232-GettyImages-929918572


బాధితురాలి కథనం: బెంగళూరుకు చెందిన స్వేత యక్తుంగ్మా అనే యువతి మార్చి 28 రాత్రి సుమారు 10.20 గంటలకు స్విగ్గీకి ఫుడ్ ఆర్డర్ చేసింది. రాత్రి 10.40 గంటలకు వచ్చిన డెలివరీ బాయ్.. తనకు 5 స్టార్స్ వేయాలని కోరాడు. ఆ తర్వాత తన కోరిక తీర్చాలని అడిగాడు. దీంతో ఆమె భయంతో అతని నుంచి ఆహారాన్ని లాక్కొని తలుపులు వేసుకుంది. అనంతరం స్విగ్గీకి ఫిర్యాదు చేయగా.. స్విగ్గీ ఆమెకు క్షమాపణలు చెబుతూ రూ.200 కూపన్ ఇచ్చింది. దీంతో ఆమె మరింత ఆగ్రహానికి గురైన ఆమె ఫేస్‌బుక్‌లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పోస్ట్ చేసింది.
భవిష్యత్తుల్లో మరెవ్వరికీ ఇలా జరగకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో స్వీగ్గీ స్పందిస్తూ.. కస్టమర్ భద్రత తమకు ఎంతో ముఖ్యమని, దీనిపై తమ ఇంటర్నల్ టీమ్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. అయితే, ఆమె పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు స్విగ్గీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.