యాప్నగరం

viral: కిలీపాల్‌కి తీవ్ర గాయాలు.. కత్తితో ఐదుగురు వ్యక్తుల దాడి

భారతీయులకు బాగా దగ్గరైన టాంజానియా వైరల్ సెన్సేషన్ కిలీపాల్‌ని శత్రువులు టార్గెట్ చేస్తున్నారు. అతని ఎదుగుదలను భరించలేక చంపేయాలని కుట్ర పన్నారా? ఏం జరుగుతోంది? టాంజానియాలో ఎందుకీ పరిస్థితి? కిలీపాల్‌పై దాడి వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతను గాయపడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అతను త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కోరుకుంటున్నారు. అసలేం జరిగింది? అతనిపై దాడి చేసిందెవరు? ఎందుకు? తెలుసుకుందాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 2 May 2022, 9:33 am
కిలీపాల్ (Kili Paul).. ఇప్పుడీ పేరు ప్రపంచ సంచలనం. ఆఫ్రికాలో పేద దేశమైన టాంజానియా (Tanzania)కి చెందిన ఈ కుర్రాడు స్వతహాగా డాన్సర్. క్రమంగా తనలోని టాలెంట్‌ను ప్రపంచానికి చాటుతూ... వైరల్ సెన్సేషన్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అయ్యాడు. ముఖ్యంగా భారతీయుల పాటలు, డైలాగ్స్‌కి లిప్ సింక్ ఇవ్వడం, డాన్స్ చెయ్యడం ద్వారా... ఇండియన్స్‌కి దగ్గరయ్యాడు. అతని అభిమానుల్లో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి కిలీపాల్‌ని దుండగులు టార్గెట్ చేశారు. అతని ఎదుగుదలను భరించలేక దాడికి దిగారు. (Kili Paul Attacked)
Samayam Telugu గాయపడిన కిలీపాల్ (image credit - youtube and instagram)


"ఐదుగురు వ్యక్తులు నాపై దాడి చేశారు. వాళ్లను ఎదుర్కునేందుకు ప్రయత్నించాను. ఆ క్రమంలో నా కుడి చెయ్యి బొటనవేలికి కత్తి గాయం అయ్యింది. ఐదు కుట్లు పడ్డాయి. నన్ను కర్రలు, ముళ్ల కంచెలతో కొట్టారు. దేవుడి దయవల్ల నేను వాళ్లను ఎదుర్కొని ఇద్దర్ని కొట్టగలిగాను. దాంతో ఐదుగురూ పారిపోయారు. అప్పటికే నాకు గాయాలయ్యాయి. నా కోసం ప్రార్థించండి. ఇది భయానకం" అని 26 ఏళ్ల కిలీపాల్ తెలిపాడు. అతని బొటనవేలుకే కాదు... కాళ్లకు కూడా గాయాలయ్యాయి.

కిలీపాల్ ఎదుగుదలను భరించలేకే ఈ దాడి చేసినట్లు కనిపిస్తోంది. ఒంటిమీద కప్పుకునేందుకు బట్టలు కూడా లేనంత పేద కుటుంబం కిలీపాల్‌ది. అతని సోదరి నీమా పాల్ కూడా తరచూ అన్నయ్యతో కలిసి భారతీయ పాటలకు లిప్ సింక్ ఇస్తూ ఉంటుంది. ఇలా వీళ్లిద్దరూ సెలబ్రిటీలుగా మారారు. ప్రస్తుతం కిలీపాల్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 36 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. అలాగే యూట్యూబ్‌లో 9వేల మంది ఉన్నారు. తన టాలెంట్‌తోనే అతను అభిమానుల హృదయాలు గెలుచుకుంటున్నాడు. కానీ ఇది గిట్టని వాళ్లు దాడి చేసినట్లు తెలుస్తోంది.

View this post on Instagram A post shared by Kili Paul (@kili_paul)

ఫిబ్రవరిలో టాంజానియాలోని భారత హైకమిషన్... కిలీపాల్, నీమాపాల్‌ని సత్కరించింది. అంతకుముందు మన్‌కీబాత్ 86వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కిలీపాల్‌ని మెచ్చుకున్నారు. అతన్ని చూసి ప్రేరణ పొందమని భారతీయులను కోరారు. ఆ తర్వాత కిలీపాల్ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతూ... ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేశాడు. మోదీ తనను మెచ్చుకోవడం లక్షల సార్లు ప్రేరణ కలిగిస్తుందని తెలిపాడు.
View this post on Instagram A post shared by Kili Paul (@kili_paul)

టాంజానియా లాంటి పేద దేశం నుంచి ఓ వ్యక్తి ఎదుగుతుంటే అతన్ని తొక్కేయాలనే కుట్ర జరుగుతుండటం విషాదకరమే. కిలీపాల్ ఎదిగితే ఆ దేశానికే మంచిది. అతన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకొని ఆ దేశం విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు. తద్వారా విదేశీ ఆదాయం భారీగా సంపాదించవచ్చు. అలాంటివేవీ జరగట్లేదు గానీ ఇలాంటి దారుణాలు మాత్రం జరుగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.