యాప్నగరం

ఛార్జింగ్ పెట్టి మొబైల్‌లో గేమ్స్ ఆడిన యువకుడు, షాక్ కొట్టడంతో..

మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే.. ఈ యువకుడికి ఎదురైన ప్రమాదమే రేపు మరెవ్వరికైనా జరగొచ్చు.

Samayam Telugu 4 Dec 2019, 8:13 pm
మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగానే చాలామంది పాటలు వింటారు. లేదా వీడియోలు, గేమ్స్ ఆడుతుంటారు. అలా చేయడం ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం.
Samayam Telugu Image by Hannes Edinger from Pixabay
Image by Hannes Edinger from Pixabay


థాయ్‌ల్యాండ్‌కు చెందిన కిట్టిశాక్ మూన్‌కిట్టి (28) సోమవారం మధ్యాహ్నం.. పరుపుపై పడుకొని మొబైల్‌లో గేమ్స్ ఆడాడు. బ్యాటరీ అయిపోవడంతో మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టి గేమ్స్ కొనసాగించాడు. ఛార్జర్ నుంచి విద్యుత్ ప్రసారం కావడంతో కిట్టిశాక్ విద్యుద్ఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: వ్యక్తి కంట్లో ఏలిక పాము.. 12 ఏళ్ల తర్వాత వెలికితీత, కుక్క కరవడంతో..

కొన్ని గంటల తర్వాత అతడి తల్లి రిన్నాపార్న్ మూన్‌కిట్టి ఇంటి పనిలో సాయం చేయడం కోసం కిట్టిశాక్‌ను పిలిచింది. అతడు ఎంతకీ స్పందించకపోవడంతో అతడి గదిలోకి వెళ్లి చూసింది. దీంతో ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ ఫోన్ వద్ద నిర్జీవంగా పడి ఉన్న కొడుకును చూసి షాకైంది. అతడి చేయి, ముంజేతులపై గాయాలు ఉండటంతో షాక్ కొట్టి ఉండవచ్చని భావించిన ఆమె ఓ కర్రతో కదిపి చూసింది. అప్పటికీ అతడు స్పందించలేదు. దీంతో వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ చేసింది. అతడి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా మొబైల్ ఛార్జర్ వల్ల అతడు విద్యుద్ఘాతానికి గురై చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Also Read: కుక్క నాకడంతో ప్రాణాలు కోల్పోయిన యజమాని.. ఘటనపై షాకింగ్ వాస్తవాలు!
Also Read: ఓ మై గాడ్.. మొబైల్‌లో ఫుట్‌బాల్ చూస్తూ వ్యక్తి మృతి, ఇయర్ ఫోన్సే ప్రాణం తీశాయా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.