యాప్నగరం

మొబైల్ ఛార్జర్‌ను నోట్లో పెట్టుకున్న చిన్నారి మృతి

జాగ్రత్త.. ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే మొబైల్ ఛార్జర్లను ఇలా వదిలేయొద్దు. నిర్లక్ష్యంతో వారి ప్రాణాలను బలి తీసుకోవద్దు.

Samayam Telugu 22 May 2019, 9:48 pm
రెండేళ్ల చిన్నారి మొబైల్ ఛార్జర్‌ను నోట్లో పెట్టుకుని విద్యుద్ఘాతానికి గురై మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జహంగిరాబాద్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీలోని ముస్తఫబాద్‌లో నివసిస్తున్న రజియా తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఛార్జింగ్ తర్వాత ఛార్జర్‌ను విద్యుత్ బోర్డుకు వదిలేసి ఫొన్ తీశారు. రజియా ఛార్జర్ పిన్‌తో ఆడుతూ దాన్ని నోట్లో పెట్టుకుని షాక్‌కు గురైంది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ చిన్నారి చనిపోయిందని తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జహంగిరాబాద్ పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.