యాప్నగరం

రూ.2 కోట్లతో వినాయకుడి గుడి నిర్మించిన క్రైస్తవ వ్యాపారి

అతడు ఏసుక్రీస్తుతోపాటు వినాయకుడిని కూడా నమ్ముతాడు. అందుకే, రూ.2 కోట్లు వెచ్చించి మరీ గణపతి ఆలయాన్ని కట్టించి ఆశ్చర్యపరిచాడు.

Samayam Telugu 22 Jul 2021, 5:24 pm
వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదిగినా.. అతడు తన ఊరిని మరిచిపోలేదు. తన మతం వేరైనా.. తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం రూ.2 కోట్లు వెచ్చించి మరీ తన ఊరిలో సిద్ధివినాయకుడి గుడిని కట్టించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రైస్తవుడైనా.. హిందూ మతంపై తనకు ఉన్న గౌరవాన్ని చాటాడు.
Samayam Telugu Representational Image/Pixabay


ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లా శిర్వాలో చోటుచేసుకుంది. గాబ్రియేల్ ఎఫ్ నజరేత్ అనే వ్యాపారి పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ముంబయి వెళ్లిపోయాడు. కొన్నాళ్లు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేశాడు. కానీ, అతడికి ఏదీ కలిసిరాలేదు. దీంతో అతడే స్వయంగా బ్లాక్స్, మౌల్డ్స్ తయారీ సంస్థను ఏర్పాటు చేశాడు.

ముంబయిలో సుమారు 55 ఏళ్లు నివసించిన గాబ్రియెల్ క్రైస్తవుడైనా.. వినాయకుడితో అతడికి ప్రత్యేకమైన బంధం ఉంది. ఏసుక్రీస్తుతోపాటు అతడు గణపతిని కూడా నమ్ముతాడు. గాబ్రియల్ తిరిగి తన సొంత ఊరికి చేరుకోగానే వినాయకుడికి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా గాబ్రియెల్ స్నేహితుడు పుండలిక మారదే మాట్లాడుతూ.. ‘‘ఉడిపిలోని అమ్మాని రామన్న శెట్టి మెమోరియల్ హాల్‌లోని గణపతి ఆలయమంటే గాబ్రియెల్‌కు చాలా ఇష్టం. దీంతో అదే తరహాలో గుడిని నిర్మించాలనేది అతడి కోరికతో ఈ నిర్మాణం చేపట్టాడు. 36 ఇంచుల వినాయకుడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. పూజారి కోసం అక్కడే ప్రత్యేకంగా ఓ ఇంటిని కూడా నిర్మించాడు’’ అని తెలిపాడు.
ఏం తెలివి గురూ.. వేడి తగ్గించేందుకు దుబాయ్‌లో ఫేక్ వర్షం, రోడ్లు జలమయం!కరోనా వైరస్ వల్ల ఆలయ ప్రారంభం పనులు వాయిదా పడ్డాయి. దీంతో గత వారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, బ్రహ్మ కలశోత్సవం నిర్వహించారు. పలిమారు ముట్ సీర్ శ్రీ విద్యాదీశా తీర్థ స్వామి గురువారం ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణ బాధ్యతలను ముగ్గురు సభ్యుల కమిటీ నిర్వహిస్తుంది. ఆలయ నిర్మాణానికి సహకరించిన ఇంజినీర్, వాస్తు శిల్పి నగేష్ హెగ్డే, గాబ్రియెల్ స్నేహితులు సతీష్ శెట్టి, రత్నాకర్ కుక్యాన్‌ ఈ కమిటీలో ఉన్నారు.

Read Also:

రాత్రయితే.. ఈ కోటలో అంత అరాచకమా, ఇక్కడికి ఒంటరిగా వెళ్లకండి!

కన్నె పిల్లలే టార్గెట్.. సెక్స్ చేసి హత్యలు, భార్య సాయంతో భర్త అరాచకాలు.. మిస్టరీ వీడిందిలా!

మిస్సైన ఆ విమానం 35 ఏళ్ల తర్వాత.. 92 అస్థిపంజరాలతో ల్యాండైంది!

16 ఏళ్ల వయస్సు.. మాంసం ముద్దలా మారిన శరీరం, ఆమెను అలా చేసింది ఎవరు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.