యాప్నగరం

ఫోన్లు చూడకుండా తింటే.. ఫ్రీ పిజ్జా, రెస్టారెంట్ బంపర్ ఆఫర్

మీరు ఫోన్ చూడకుండా స్నేహితులు లేదా బంధువులతో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయగలరా? అలా చేస్తే మీరు ఉచిత పిజ్జాను సొంతం చేసుకోవచ్చు.

Samayam Telugu 11 Jun 2019, 8:30 pm
రోజుల్లో ఫోన్ చూడకపోతే కాలం ఆగిపోయినంత ఆందోళన కలుగుతోంది. తినేప్పుడు, పడుకునేప్పుడు.. చివరికి బాత్రూమ్‌కు కూడా ఫోన్లు వెంట తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఓ రెస్టారెంట్.. తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే ఫోన్లు చూడకుండా ఆహారం తింటారో వారికి ఉచితంగా పిజ్జా ఇస్తామని వెల్లడించింది.
Samayam Telugu 1560248900-Screenshot_766


ఫ్రెస్కోలోని ‘ద కర్రీ పిజ్జా కంపెనీ’ తమ కస్టమర్ల మధ్య సంబంధ బాంధవ్యాలను పెంపొందించేందుకు ‘టాక్ టు ఈచ్ అదర్ డిస్కౌంట్’ (ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే రాయితీ) ప్రకటించింది. గ్రూప్‌గా వచ్చే కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ గ్రూప్‌లో కనీసం నలుగురు కస్టమర్లు ఉండాలి. తినేప్పుడు వీరు తమ ఫోన్లు అస్సలు ఉపయోగించకూడదు. ఫోన్ పక్కన పెట్టి తినడం కష్టమని భావించేవారికి ప్రత్యేకంగా లాకర్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు.

ఆహారం తినడం పూర్తయ్యేవరకు కస్టమర్లు తమ బంధువులు లేదా స్నేహితులతో కబుర్లు చెప్పుకోవాలి. ఇలా చేస్తే ఆ గ్రూప్ మొత్తానికి 24 గంటల్లో లార్జ్ పిజ్జా ఇస్తామని ఫేస్‌బుక్ పేజీలో ప్రకటించింది. దీన్ని హోం డెలవరీ లేదా రెస్టారెంట్ నుంచైనా తీసుకోవచ్చని తెలిపింది. తాము ప్రతి నెలా నిరాశ్రయులకు పిజ్జాలు దానమిస్తామని, మీరు గెలుచుకునే పిజ్జాను తమతో కలిసి వారికి దానం చేయవచ్చని పేర్కొంది. రెస్టారెంట్ యజమాని వారిందర్ మల్హి మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో మా పిల్లలను తినేప్పుడు మొబైల్ చూడొద్దని చెప్పాను. దాని వల్ల మంచి మార్పు కనిపించింది. దీంతో రెస్టారెంట్‌లో కూడా ఇలాంటి నియమం ఒకటి పెట్టాలని నిర్ణయించాం. ఇప్పటి వరకు 40 నుంచి 50 పిజ్జాలను ఉచితంగా అందించాం’’ అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.