యాప్నగరం

టాయిలెట్‌లో ఫోన్ చూస్తున్నారా? ఈ వ్యాధి మీకు నరకం చూపిస్తుంది!

టాయిలెట్‌లో కూర్చొని చాటింగ్ చేస్తూ టైంపాస్ చేస్తున్నారా? అయితే, జాగ్రత్త.. భవిష్యత్తులో కూర్చోవడం, నడవడానికి కూడా కష్టమయ్యే వ్యాధి వస్తుంది.

Samayam Telugu 20 Sep 2019, 11:54 pm
క్క క్షణం ఫోన్ కనిపించకపోతే.. ప్రళయం ముంచుకొస్తున్నంత కంగారు వస్తుంది. పని ఉన్నా లేకపోయినా అది నిత్యం చేతిలో ఉండాల్సిందే. చివరికి.. టాయిలెట్‌కు వెళ్లినా సరే అది తోడు రావల్సిందే. లేకపోతే.. ఏదో వెలితిగా ఉంటుంది. ఒక పక్క ‘ఆ పని’ పూర్తి చేస్తూనే మరో పక్క.. మొబైల్‌తో టైంపాస్ చేయడం నేటి యువతకు అలవాటు.
Samayam Telugu GettyImages-672268588


అయితే, అలవాటు మీకు కొత్త రోగాలను అంటగడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ఓ సర్వే ప్రకారం.. ఆ దేశానికి చెందిన యువతలో 57 శాతం మంది టాయిలెట్లో సైతం మొబైల్‌తోనే టైంపాస్ చేస్తున్నారని పేర్కొంది. ఒక వైపు ఫోన్‌ చూస్తూనే మరోవైపు విసర్జన పని పూర్తిచేస్తామని యువత అంగీకరించారని తెలిపింది.

Read also: తలలో ఇరుక్కున్న బుల్లెట్.. 2 మైళ్ల నుంచి దూసుకొచ్చిన తూటా!

ఇలా టాయిలెట్లలో ఫోన్‌తో గడపడం వల్ల మూలశంక వ్యాధి (Piles) ఏర్పడుతుందని, పిరుదుల్లో మొలలు పుట్టుకొస్తాయి. ఈ సర్వేపై పేషెంట్ డాట్ ఇన్ఫో డైరెక్టర్ డాక్టర్ సారా జర్వీస్ Sun Online వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘టాయిలెట్‌నూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల అవసరం కంటే ఎక్కువ సేపు అందులో కూర్చుంటారు. దీనివల్ల పెద్ద పేగు చివరి భాగంలో గల పాయువులోని సిరలపై ఒత్తిడి పడుతుంది’’ అని తెలిపారు.

‘‘మలబద్ధకం, మొలలు సమస్య వల్ల భవిష్యత్తులో కూర్చోడానికే ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ భాగం పుండులా మారుతుంది. ఒక్కోసారి రక్తస్రావం కూడా జరుగుతుంది. విసర్జనకు వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గర్బిణీ స్త్రీలు, దీర్ఘకాలిక దగ్గు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య యుక్త వయస్సులోనే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి’’ అని సారా పేర్కొన్నారు.

Read also: ఊపిరితీత్తులను రాయిలా మారుస్తున్న ఇ-సిగరేట్స్.. మరణం ముందే వస్తుంది!

‘‘పిరుదులపై దురద, విసర్జన రంగు ఎర్రగా మారడం, విసర్జన పూర్తయినా ఇంకా వస్తున్నట్లే అనిపించడం, చీము రావడం వంటి లక్షణాలు కనిపించినట్లయితే.. అవి మూలశంఖకు సంకేతాలని భావించాలి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. బాధితులు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. నిత్యం వ్యాయామం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా.. మీ మొబైల్ ఫోన్‌ను బయట పెట్టి ప్రశాంతంగా టాయిలెట్‌లో కూర్చోండి’’ అని తెలిపారు. చూశారుగా.. ఇకపై టాయిలెట్‌లోకి వెళ్లినప్పుడు ఈ సూచలను తప్పకుండా గుర్తుంచుకోండి. లేకపోతే భవిష్యత్తులో కూర్చోడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.