యాప్నగరం

viral video: విచిత్రంగా వచ్చిన మెరుపు.. తర్వాత జరిగిన అద్భుతం

మెరుపు వేగం అంటారే.. అంటే గంటకు 4,34,522 కిలోమీటర్ల వేగం. అంత వేగంతో మెరుపు వచ్చి మనపై దాడి చేస్తే ఇంకేమైనా ఉందా. ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Samayam Telugu 28 Dec 2021, 10:03 am
ఇండొనేసియా... జకార్తాలో జరిగింది అద్భుతమే అనుకోవచ్చు. ఎందుకంటే... వర్షంలో గొడుగుతో వెళ్తున్న వ్యక్తిపై మెరుపు... దాడిచేసినా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. చాలా అరుదైన ఘటన ఇది. అసలు మెరుపు గనక దాడి చేస్తే చనిపోతున్న విషయం కూడా తెలియదు. అంత వేగంగా చనిపోతారు. ఎందుకంటే మెరుపు సెకండ్‌కి 120 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. అది హైదరాబాద్ నుంచి విశాఖకు 4 లేదా 5 సెకండ్లలో వెళ్లగలదు. అంత వేగంతో వచ్చే మెరుపు దాడి చేస్తే... ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరం (struck by lightning video).
Samayam Telugu సెక్యూరిటీ గార్డ్‌పై మెరుపు దాడి (image credit - twitter - @Heritzal)


మెరుపు అతి వేగంతో వస్తుంది కాబట్టే... దాన్ని వీడియో తియ్యడం కష్టం. కానీ ఓ సీసీటీవీ ఫుటేజ్‌లో అది రికార్డ్ అయ్యింది. జకార్తాలో 35 ఏళ్ల వ్యక్తి... సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. డ్యూటీలో ఉండగా... వర్షంలో గొడుగు పట్టుకొని బయటకు వెళ్తున్నాడు. అక్కడో ట్రక్ పార్క్ చేసి ఉంది. ట్రక్ దగ్గరకు అతను చేరుకుంటున్న సమయంలో మెరుపు దాడి జరిగింది. క్షణంలో గొడుగు కాలి బూడిదైంది. అతను ఉన్నపళంగా కుప్పకూలాడు (lightning video).

అది గమనించిన తోటి ఉద్యోగులు పరుగున వెళ్లి అతన్ని కదిపిచూశారు. లక్కీగా ప్రాణాలతో ఉన్నాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి అతన్ని తరలించారు. అతనికి చేతిపై కాలినట్లు తెలిసింది. అతనికి 4 రోజులు ట్రీట్‌మెంట్ అందించి... డిశ్చార్జి చేశారు. ఇప్పుడు అతను ఇంట్లో ఉంటూ రికవరీ అవుతున్నాడు.

ఆ వీడియో (viral video)ని ముందుగా ఇక్కడ చూడండి. ఆ తర్వాత కీలకమైన విషయం ఒకటి చెప్పుకుందాం.

వీడియో చూశారుగా... ఆశ్చర్యంగా ఉంది కదూ. నెటిజన్లు చాలా ఆశ్చర్యపోతున్నారు. గొడుగు వల్లే ఇలా జరిగివుంటుందా అనే అనుమానం కలగగా... ఓ విషయం తెలిసింది. ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఓ వాకీ టాకీ (walkie-talkie) వుంది. అది కంటిన్యూగా గాలిలోని తరంగాల్ని లాక్కుంటూ ఉంది. అదే విధంగా మెరుపును కూడా అది లాక్కుంది. అందుకే అతనిపై మెరుపు దాడి జరిగిందని తేలింది.

చూశారా... వర్షంలో బయటకు వెళ్లేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు మన దగ్గర ఉంటే... మరింత అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది మెరుపులు, పిడుగులు పడుతున్నప్పుడు... చెట్ల కిందకు వెళ్తారు. అది మరింత ప్రమాదకరం. చెట్లు పిడుగుల్ని లాక్కుంటాయి. పిడుగు పడినప్పుడు చెట్టు కింద ఎవరు ఉన్నా చనిపోయే ప్రమాదం ఉంటుంది. మార్చిలో అదే జరిగింది. గురుగ్రామ్‌లోని ఓ సొసైటీలో... చెట్టు కింద ఉన్న నలుగురూ పిడుగుపడి చనిపోయారు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి

చూశారుగా.. క్షణం ముందు వరకూ ప్రాణాలతో ఉన్నారు. పిడుగు పడిన క్షణంలోనే అంతా చనిపోయారు. చనిపోయిన విషయం కూడా వాళ్లకు తెలియదు.

viral video: గేటు దూకి ఇంట్లోకి చిరుతపులి.. ఏం చేసిందో తెలుసా?
ఈ రెండు వీడియోలూ మనకు ఓ హెచ్చరిక లాంటివి. మన వాతావరణాన్ని మనం ఎంతగా అర్థం చేసుకోగలిగితే.. మనకు ముప్పు అంతగా తగ్గుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.