యాప్నగరం

గుజరాత్‌లో గడ్డి తిన్న సింహం.. కారణం ఇదేనట!

సింహం గడ్డి తినడాన్ని ఎప్పుడైనా చూశారా? ఇదిగో గుజరాత్‌లోని గిర్ అడవుల్లో నివసిస్తున్న ఈ సింహాన్ని చూడండి.

Samayam Telugu 30 Aug 2019, 10:42 pm
మాంసం దొరక్కపోతే అడవి మృగాలు పస్తులైనా ఉంటాయేమో గానీ.. శాఖాహారం మాత్రం ముట్టవు. అయితే, గుజరాత్‌లోని గిర్ అడవుల్లో నివసిస్తున్న ఓ సింహం పచ్చగడ్డి తిని ఆశ్చర్యపరిచింది. అమ్రెలీ జిల్లా ఖంభా ప్రాంతంలో సఫారీకి వెళ్లిన సందర్శకులకు ఈ దృశ్యం చిక్కింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది.
Samayam Telugu 1567067469-Screenshot_1234


ఈ వీడియో చూసిన నెటిజనులు.. మృగరాజు గడ్డి తినడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. దీనిపై షెత్రుంజీ రేంజ్ డిప్యుటీ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) స్పందిస్తూ.. ‘‘అడవి మృగాలు గడ్డి తినడం సాధారణమే. అయితే, అవి కడుపు నింపుకోవడానికి గడ్డి తినవు. వాటి కడుపులో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు గడ్డి తింటాయి. కడుపులో జీర్ణంకాని పదార్థాలను ఆ గడ్డితోపాటు బయటకు కక్కేస్తాయి’’ అని తెలిపారు.

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.