యాప్నగరం

యాక్సిడెంట్ చేసి.. పోలీసుల ముందు యోగా చేసిన మహిళ!

యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ దెబ్బలతో ఎవరైనా హాస్పిటల్‌కు వెళ్తారు. ఆమె మాత్రం పోలీసుల ముందు యోగా భంగిమలు ప్రదర్శిస్తూ వింతగా ప్రవర్తించింది. ఇంతకీ ఏమైంది?

Samayam Telugu 21 Aug 2019, 8:47 pm
మహిళ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. చివరికి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలై ఉంటాయని పోలీసులు భావించారు. అయితే, ఆమె కారు నుంచి కిందికి దిగి.. యోగా భంగిమలు ప్రదర్శించడం చూసి ఆశ్చర్యపోయారు.
Samayam Telugu women_driving_1516783091


జెన్నీఫర్ రిస్చ్ (39) అనే మహిళ కాలిఫోర్నియాలోని విల్లిట్స్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడింది. పాదచారులకు ప్రమాదం వాటిల్లేలా అత్యంత వేగంగా కారు నడిపింది. దీంతో పోలీసులు ఆమెను పట్టుకోడానికి వెంబడించారు. వారి నుంచి తప్పించుకోడానికి ఆమె మరింత వేగంగా కారు నడిపింది. చివరికి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి ఉంటుందని పోలీసులు తొలుత భావించారు. అయితే, ఆమె కారు నుంచి బయటకు వచ్చి యోగా భంగిమలు ప్రదర్శించింది. దీంతో పోలీసులకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. చివరికి ఆమెను అరెస్టు చేసి మెండిసినో కౌంటీ జైలుకు తరలించి, 35 వేల పౌండ్ల (రూ.30,32,977) పూచీ కత్తుపై బెయిల్ మంజురు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.