యాప్నగరం

ఇక్కడ బిర్యానీ ఉచితం.. ఆకలేస్తుందని చెబితే చాలు!

‘‘ఆకలేస్తుందా? అయితే, వచ్చి ఇక్కడ కడుపు నింపుకోండి’’ అనే ఆ బోర్డును చూసి ఆ స్టాల్ నిర్వాహకురాలని అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు.

Samayam Telugu 16 Apr 2021, 8:23 pm
కరోనా వైరస్, లాక్‌డౌన్‌లో ఎంతోమందిని రోడ్డు పడేసింది. చాలామంది ఉపాధి, ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. మళ్లీ సామాజికంగా, ఆర్థికంగా పుంజుకోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ భయంకరంగా వ్యాపిస్తోంది. దీంతో జనాలు బిక్కుబిక్కున కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితి ఎంతో మంది కూలీలకు పని లేకుండా చేస్తోంది. పేదలు ఆకలి దప్పికలతో అల్లాడుతున్న ఈ తరుణంలో తమిళనాడుకు చెందిన ఓ మహిళ పేదల కడుపు నింపేందుకు ముందుకొచ్చింది. ఆకలేస్తుందని చెబితే చాలు.. అమ్మలా అన్నం పెడుతుంది. వేడి వేడి బిర్యానీ ఇచ్చి ఆదుకుంటోంది.
Samayam Telugu Image Credit: @RJ_Balaji/Twitter

భార్యకు అదంటే భయం.. 18 ఇళ్లు మారిన జంట, ఇక విడాకులే..కొయంబతూర్‌లోని పులియాకులాం ప్రాంతంలో ఉన్న స్టాల్ ముందు ఉన్న ఓ బ్లాక్ బోర్డు అటుగా వెళ్లేవారిని ఆకర్షిస్తోంది. ‘‘మీకు ఆకలిగా ఉందా? ఇక్కడికి వచ్చి కడుపు నింపుకోండి’’ అని దానిపై రాసి ఉంది. ఈ స్టాల్ ఫొటోలను తమిళనాడుకు చెందిన రేడియో జాకీ, ‘అమ్మోరు తల్లి’ సినిమా హీరో, దర్శకుడు ఆర్.జె. బాలాజీ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీంతో నెటిజనులు ఆమె మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మానవత్వం ఇంకా బతికి ఉందని చెప్పేందుకు ఈ మహిళే నిదర్శనమని కొనియాడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.