యాప్నగరం

జలపాతంలో జారి 50 అడుగుల ఎత్తు నుంచి పడిన మహిళ, వీడియో వైరల్

అందాల జలపాతాన్ని చూస్తూ తన్మయానికి గురైన మహిళ.. కాలుజారి 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. ఇదంతా ఆమెకు అమర్చిన కెమేరాలో రికార్డైంది.

Samayam Telugu 10 Sep 2019, 11:18 pm
వాయిలోని జలపాతం అందాలు చూసేందుకు వెళ్లిన మహిళ.. అక్కడి నుంచి జారిపడింది. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలైతే నిలిచాయి. కానీ, తీవ్ర గాయాలతో.. నడవలేని స్థితిలో ఆసుపత్రిపాలైంది. ఇదంతా ఆమె తలకు అమర్చిన గోప్రో కెమేరాలో రికార్డైంది. ఈ వీడియోను ‘వైరల్ హగ్’ అనే చానెల్ యూట్యూబ్‌లో పోస్టు చేసింది.
Samayam Telugu Untitled


యూనివర్సిటీ ఆఫ్ హవాయి విద్యార్థిని హీదర్ ఫ్రిసెన్ అనే 26 ఏళ్ల మహిళ తన స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె జలపాతం వద్దకు వెళ్లి అక్కడి అందాలను చూస్తూ రాళ్లపై నడవసాగింది. అయితే, వాటిపై నాచు ఎక్కువగా ఉండటంతో ఆమె జారిపోయింది. క్షణాల్లో ఆమె జలపాతం నీటిలో పడింది.

Read also: కంటిలోకి దూసుకెళ్లిన కుక్కర్ విజిల్.. బాధతో విలవిల్లాడిన మహిళ

ఆ వేగానికి నీటిలో మునిగి అడుగు ఉండే రాళ్లను వేగంగా తాకింది. ఈ ఘటనలో ఆమె పాదాలకు గాయాలయ్యాయి. ఆమె అరుపులు వినగానే కొంతమంది పర్యాటకులు అక్కడికి వచ్చి హీదర్‌కు సాయం చేశారు. ఈ ఘటనలో హీదర్ శరీరంలోని 10 పక్కటెములు విరిగాయి. ఆమె ఊపిరితీత్తులు దెబ్బతిన్నాయి.

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.