యాప్నగరం

ఆ వంతెన ఎక్కితే కుక్కలు ఆత్మహత్య చేసుకుంటాయ్!

సాధారణంగా కుక్కలు ఆత్మహత్యలు చేసుకోవు. కానీ, ఆ వంతెన మీదకు వెళ్తే మాత్రం అమాంతంగా దూకి ప్రాణాలు కోల్పోతాయి.

Suresh Chelluboyina | Samayam Telugu 18 Oct 2019, 1:23 am

ప్రధానాంశాలు:

  • 1950 నుంచి ప్రజలు ఈ వంతెనను ‘ద బ్రిడ్జ్ ఆఫ్ డెత్’ అని పిలవడం మొదలుపెట్టారు.
  • ఎందుకంటే, కుక్కలు ఆ వంతెన పైకెక్కి కింది దూకి చనిపోయేవి. ఇప్పటివరకు సుమారు 600 పైగా కుక్కలు అక్కడి నుంచి దూకాయి.
  • వీటిలో కొన్ని చనిపోగా, మరికొన్ని ప్రాణాలతో బయటపడ్డాయి.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu GettyImages-654884982
వంతెన పేరు ఎత్తితే చాలు.. కుక్కల యజమానులు హడలిపోతారు. తమ కుక్కలను అటువైపు పోకుండా జాగ్రత్తపడతారు. ఎందుకంటే.. ఆ వంతెన మీదకు వెళ్లిన ఏ కుక్క తిరిగి రాదు. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాయి. అదేంటీ? కుక్కలు ఎలా ఆత్మహత్య చేసుకుంటాయనేగా మీ అనుమానం? అయితే, మీరు స్కాట్‌ల్యాండ్ డాగ్ సూసైడ్ వంతెన గురించి తెలుసుకోవల్సిందే.
స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్‌గౌవ్ నగరం నుంచి ఒక అరగంట ప్రయాణం చేస్తే ఓవర్టాన్ హౌస్ అనే 19వ శతాబ్దం నాటి కోట వస్తుంది. సుమారు 160 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ప్రసూతి ఆసుపత్రిగా ఉపయోగించేవారు. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్య సైనికులు ఇక్కడే బస చేసేవారు. ప్రస్తుతం ఇక్కడ సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే, ఈ కోట కంటే.. దానికి సమీపంలో నిర్మించిన వంతెనే ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది.

1950 నుంచి ప్రజలు ఈ వంతెనను ‘ద బ్రిడ్జ్ ఆఫ్ డెత్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే, కుక్కలు ఆ వంతెన పైకెక్కి కింది దూకి చనిపోయేవి. ఇప్పటివరకు సుమారు 600 పైగా కుక్కలు అక్కడి నుంచి దూకాయి. వీటిలో కొన్ని చనిపోగా, మరికొన్ని ప్రాణాలతో బయటపడ్డాయి. అప్పటి నుంచి పెంపుడు కుక్కల యజమానులు తమ కుక్కలతో ఆ ప్రాంతాన్ని సందర్శించడం లేదు. మనుషుల తరహాలో కుక్కలు ఆత్మహత్యలు చేసుకోలేవనే సంగతి తెలిసిందే. కానీ, అక్కడికి వెళ్తే అవి ఎందుకు ప్రవర్తిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోడానికి చాలామంది ప్రయత్నించారు.

అక్కడి నుంచి దూకి చనిపోయిన చాలా కుక్కలు వంతెన కింద ఉన్న రాళ్లపై పడటం వల్ల చనిపోయాయని తెలిసింది. అక్కడ చనిపోయిన కుక్కల ముక్కు నుంచి రక్తం కారేది. పైగా ఆ కుక్కలన్నీ వంతెనకు కుడి వైపు నుంచే దూకడం గమనార్హం. 2005లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన డాక్టర్ డెవిడ్ సాండ్స్ అనే సైకాలజిస్ట్ ఈ మిస్టరీని చేధించేందుకు ఈ వంతెన వద్దకు వెళ్లాడు. తనతోపాటు కెమేరా టీమ్‌ను కూడా తీసుకెళ్లాడు.

‘‘కుక్కల గురించి మరిచిపోండి.. వంతెన మీదకు ఎక్కిన తర్వాత నాకు కూడా వింత భావన కలిగింది. ఒళ్లంతా మండిపోతున్నట్లు అనిపించింది. నాతో తీసుకెళ్లిన 19 ఏళ్ల కుక్క హ్యండ్రిక్స్ ఒక్క ఉదుటున వంతెన మీద నుంచి దూకింది. అయితే, అది ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో అది చాలా ఒత్తిడికి లోనైనట్లు కనిపించింది. అందుకే అది అక్కడి నుంచి దూకేసిందని అనిపించింది’’ అని డెవిడ్ సాండ్స్ తెలిపారు. ఆ వంతెన నిర్మాణంలో ఏదో లోపం ఉందని, అక్కడ ఏర్పడుతున్న గందరగోళ ఫ్రీక్వెన్సీని కేవలం కుక్కలు మాత్రమే గ్రహించగలవన్నారు. అయితే, కుక్కలు ఆత్మహత్య చేసుకుంటున్నాయని భావించడం కంటే అనాలోచితంగా దూకేస్తున్నాయని అనుకోవడమే ఉత్తమం అని తెలిపారు. ఎంతమంది ఎన్ని పరిశోధనలు చేసినా.. ఈ మిస్టరీని చేధించలేకపోయారు. దీంతో అక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని, అందుకే కుక్కలు అక్కడికి వెళ్లాక బలవన్మరణానికి పాల్పడుతున్నాయని మరికొందరు వాదిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.